హోమ్ /వార్తలు /national /

జగన్ ప్రభుత్వానికి ఆ దేవుడే దిక్కు... ఉండవల్లి కీలక వ్యాఖ్యలు...

జగన్ ప్రభుత్వానికి ఆ దేవుడే దిక్కు... ఉండవల్లి కీలక వ్యాఖ్యలు...

ఉండవల్లి అరుణ్ కుమార్ (File)

ఉండవల్లి అరుణ్ కుమార్ (File)

ఏపీ ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉందని, ఇప్పుడు ఆ దేవుడే సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆదాయం తీవ్రంగా పడిపోయిందని.. కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. కేంద్రం నుంచి రావలసినవి రావడం లేదని.. ఇక్కడ ఆదాయం కూడా ఏమీ లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ గతంలోనే హెచ్చరించారని.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్ర పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింత స్పష్టత వస్తుందన్నారు. దేవుడు ఉన్నాడని తరుచూ సీఎం జగన్ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన్ను ఆశీర్వదించాలని ఉండవల్లి అన్నారు. ఇక పోలవరంపై మాట్లాడుతూ... బడ్జెట్‌లో పోలవరానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి కొడుకు 'మాట తప్పడు.. మడమ తిప్పడు' అన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.

జగన్‌ ముందు ఉండవల్లి సరికొత్త డిమాండ్ | Undavalli arun kumar demands high court bench in rajamundry wrote letter to ap cm ys jagan mohan reddy ak
ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్

అంతకు ముందు జగన్‌ మోహన్ రెడ్డికి సరికొత్త డిమాండ్ వినిపించారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... విశాఖతో పాటు అమరావతిలోనూ హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో పాటు రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక తీర్చాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

andhrapradesh, ap politics, justice jasthi chalameswar, konijeti raosaiah, kotla vijayabhaskarreddy, chiranjeevi, rajiv gandhi, ramoji rao, undavalli arun kumar, y.s.rajasekhar reddy, chandra babu naidu, ap government, andhra pradesh government, ec, AP Assembly Election 2019, prajarajyam, ap elections 2019, tdp, ycp, ap lok sabha election 2019, ఆంధ్రప్రదేశ్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ పాలిటిక్స్, కొణిజేటి రోశయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జాస్తి చలమేశ్వర్, రాజీవ్ గాంధీ, రామోజీరావు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ, వైసీపీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, చిరంజీవి, ప్రజారాజ్యం, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలు,
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ (File Images)

14 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్ ఈ రకమైన ఆలోచన చేశారని ఉండవల్లి సీఎం జగన్‌కు వివరించారు. దీంతో పాటు మరో అంశాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో ఇసుక లభించడం లేదని... కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉండవల్లి సూచించారు. పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Undavalli Arun Kumar

ఉత్తమ కథలు