హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ షాక్.. మరో పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్ షాక్.. మరో పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

అసదుద్దీన్ ఒవైసీ (File)

అసదుద్దీన్ ఒవైసీ (File)

Asaduddin Owaisi: ఎంఐఎం పార్టీకి చెందిన అక్తరుల్ మినహా మిగిలిన నలుగురు 243 మంది సభ్యుల శాసనసభలో 80 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీలో చేరిపోయారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి(Asaduddin Owaisi) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌లో ఆయన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు వేరే పార్టీలో చేరారు. ఎంఐఎం(AIMIM) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం బీహార్‌లో ప్రధాన ప్రతిపక్షం ఆర్‌జేడీలో చేరారు. నవంబర్ 2020‌లో జరిగిన బీహార్ (Bihar)అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసిన 20 అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను గెలుచుకోవడం ద్వారా మంచి ప్రదర్శన ఇచ్చింది.గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు అక్తరుల్ ఇమాన్ (అమూర్ నియోజకవర్గం), మహ్మద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడమామ్), షానవాజ్ ఆలం (జోకిహాట్), సయ్యద్ రుక్నుద్దీన్ (బైసీ), అజర్ నయీమి (బహదూర్‌గంజ్) ఆర్జేడీలో చేరిన వారిలో ఉన్నారు.

ఆ పార్టీకి చెందిన అక్తరుల్ మినహా మిగిలిన నలుగురు 243 మంది సభ్యుల శాసనసభలో 80 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీలో చేరిపోయారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ఒవైసీ పార్టీలోని నలుగురు ఎమ్మెల్యేల చేరికను ధృవీకరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 1.24 శాతం (5,23,279) ఓట్లను సాధించిన ఎంఐఎం.. గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్‌లో ఒక భాగంగా ఉంది. ఈ కూటమి మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి ఉపేంద్ర కుష్వాహను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

అయితే కుష్వాహ 2013లో తన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్‌లో విలీనం చేశారు. ఇక ఒవైసీ ఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో బీహార్‌లో బీజేపీని పక్కనబెట్టి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

Udaipur Murder : కన్హయ్యలాల్ అంత్యక్రియలకు వేలాదిగా జనం.. ఎన్ఐఏకు కేసు అప్పగింత

Farmers Compensation: రైతులకు రూ. 100 కోట్ల పరిహారం.. హైకోర్టు కీలక తీర్పు..

ప్రస్తుతం అసెంబ్లీలో ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీ 77 మంది ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఇక ఈ రెండు పార్టీల కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ.. జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. జేడీయూకు చెందిన నితీష్ కుమార్‌నే బీజేపీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది.

First published:

Tags: AIMIM, Asaduddin Owaisi, Bihar

ఉత్తమ కథలు