హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అందుకే కేదార్‌నాథ్ టూర్.. మోదీపై చర్యలు తీసుకోండి : ఈసీకి తృణమూల్ లేఖ

అందుకే కేదార్‌నాథ్ టూర్.. మోదీపై చర్యలు తీసుకోండి : ఈసీకి తృణమూల్ లేఖ

కేదార్‌నాథ్ యాత్రలో మోదీ(File)

కేదార్‌నాథ్ యాత్రలో మోదీ(File)

తుది దశ పోలింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోదీ కేదార్‌నాథ్, బద్రినాథ్ యాత్ర చేపట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈసీ వీటన్నింటని చూసీ చూడనట్టు వదిలేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిపోయినా.. కేదార్‌నాథ్ యాత్రను మోదీ పరోక్షంగా అందుకోసం వాడుకున్నారని తృణమూల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఆయన కేదార్‌నాథ్ యాత్ర చేపట్టారని ఆరోపించింది.యాత్రకు మీడియా పూర్తి కవరేజ్ ఇచ్చిందని.. ఇది ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది.

ఏడో దశ ఎన్నికల ప్రచారానికి మే 17వ తేదీ సాయంత్రం 6గంటలకే గడువు ముగిసింది. కానీ ఆ వెంటనే మోదీ చేపట్టిన కేదార్‌నాథ్ యాత్రకు మీడియా గత రెండు రోజులుగా విస్తృతమైన కవరేజ్ ఇచ్చింది. ఇది ఎన్నికల నియామవళికి పూర్తి విరుద్దం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కేదార్‌నాథ్ యాత్రలో మోదీ ప్రసంగించారు. ఇది అనైతికం. కాబట్టి దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలి.
తృణమూల్ కాంగ్రెస్

తుది దశ పోలింగ్‌లో ఓటర్లను ప్రభావితం చేసేందుకే మోదీ కేదార్‌నాథ్, బద్రినాథ్ యాత్ర చేపట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈసీ వీటన్నింటని చూసీ చూడనట్టు వదిలేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాయి.

First published:

Tags: Kedarnath, Lok Sabha Elections 2019, Mamata Banerjee, Narendra modi, West Bengal

ఉత్తమ కథలు