పార్లమెంటులోని ప్రతి ఎంపీ అభిప్రాయమూ కీలకమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ...పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సంఖ్య తక్కువగా ఉన్నామని విపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో చురుకైన ప్రతిపక్షాల పాత్ర ఎంతో అవసరమన్న ప్రధాని నరేంద్ర మోదీ... ప్రతిపక్షాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రతిపక్షాలు తమ గళాన్ని సభలో వినిపించవచ్చని, సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చని వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేతల ప్రతి మాట విలువైనదే అని ఆయన అన్నారు.అధికార, విపక్షాల మధ్య ఎలాంటి సంఘర్షణ లేకుండా, ప్రజాధనం వృథా కాకుండా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు.
Prime Minister Narendra Modi arrives at the Parliament for 17th Lok Sabha, says, "Every word of the Opposition is important." pic.twitter.com/TxTVzQkOF2
— ANI (@ANI) June 17, 2019
చాలా దశాబ్ధాల తర్వాత ప్రభుత్వానికి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ప్రజా శ్రేయస్సు కోసం తాము తీసుకునే నిర్ణయాలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.
PM Modi at the Parliament for the first session of the 17th LS: After several decades, a govt has won absolute majority for the second term. People have given us the chance to serve the country again. I request all the parties to support the decisions that are in favour of people pic.twitter.com/v91fmErLbs
— ANI (@ANI) June 17, 2019
Prime Minister Narendra Modi at the Parliament: Today, a new session is starting, there are new hopes and dreams with the beginning of this session. Since independence ,this Lok Sabha elections saw highest number of women voters and women MPs. pic.twitter.com/YGGGDInX99
— ANI (@ANI) June 17, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Union Budget 2019