హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పార్లమెంట్ సెషన్స్ : కేంద్రంపై విపక్షాల అవిశ్వాసం

పార్లమెంట్ సెషన్స్ : కేంద్రంపై విపక్షాల అవిశ్వాసం

చివరిగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరిగాయి. అయితే కరోనా కారణంగా మార్చి 23 నుంచి సభ నిరవధికంగా వాయిదా పడింది.

చివరిగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరిగాయి. అయితే కరోనా కారణంగా మార్చి 23 నుంచి సభ నిరవధికంగా వాయిదా పడింది.

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. విపక్ష పార్టీల భేటీలో ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు ఖర్గే తెలిపారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా వాడివేడిగా సాగనున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు సోమవారం చర్చించాయి. ఈ భేటీలో అవిశ్వాసం కూడా చర్చకు వచ్చింది. గత పార్లమెంట్ సమావేశాల్లో అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని తప్పించుకున్న మోడీ ప్రభుత్వాన్ని ఈ సమావేశాల్లో వదలకూడదని నిర్ణయించాయి. దీంతో సభలో అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించాయి. దీనికి 12 పార్టీలు మద్దతు తెలిపినట్టు ఖర్గే చెప్పారు.

గత పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు టీడీపీ కూడా అవిశ్వాసం నోటీస్ ఇవ్వనుంది. ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. దీంతో పాటు అమాయకులపై సామూహిక దాడులు, మహిళలు, దళితులపై అఘాయిత్యాలు, ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఖర్గే ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా అహ్మదాబాద్ ‌లోని ఓ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.750 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీల అంశంపై కూడా చర్చకు పట్టుబడతామని స్పష్టం చేశారు.

మరోవైపు రాజ్యసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని పెద్దల సభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం పోతోందని, మళ్లీ బ్యాలెట్ పేపర్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ, లోక్ సభ టీవీలను నియంత్రించేందుకు కుట్ర జరుగుతోందని ఆజాద్ ఆరోపించారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే సభలో జరిగే ఆటంకానికి సర్కారే జవాబుదారీ అవుతుందని హెచ్చరించారు.

First published:

Tags: Congress, Mallikarjun Kharge, Monsoon session Parliament, Narendra modi, Rajya Sabha

ఉత్తమ కథలు