బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటరీ లైబ్రెరీ భవనంలో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్లమెంట్ లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలను ఎదుర్కొనే అంశంపై ప్రధాని సూచనలు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ ఎంపీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. కాగా ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 2 విడతలలో 66 రోజుల పాటూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ప్రారంభమైన సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పలు బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, India, Narendra modi