జనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద సీఎం జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు నేతలకు ముగ్గురు పెళ్లాలు సరిపోరని, నలుగురు పెళ్లాలు కూడా కావాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘కొందరు పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకరు సరిపోరు. ఇద్దరు సరిపోరు. ముగ్గురు సరిపోరు. నలుగురు పెళ్లాలు కావాలని రకరకాలుగా జరుగుతోంది. దీన్ని బిగమీ అంటారు.’ అని సీఎం జగన్ అన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యల మీద సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి కేసులు గత ఐదేళ్లలో సుమారు 1100 కు పైగా నమోదయ్యాయని జగన్ తెలిపారు.
పవన్ కళ్యాన్ పెళ్లిళ్ల మీద సీఎం జగన్ కామెంట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ మూడు పెళ్లిళ్ల మీద జగన్ కామెంట్స్ చేశారు. తాజాగా ఏపీలో ఇంగ్లీష్ మీడియం వివాదం సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద జగన్ వ్యాఖ్యానించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, ఆయన పిల్లలు ఏ మీడియం స్కూల్లో చదువుతున్నారో చెప్పాలని సవాల్ చేశారు. అయితే, దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ‘నా మూడు పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా?’ అని ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Janasena party, Pawan kalyan, Ysrcp