ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆఫీస్ బేరర్స్ జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఓ భారీ జాబితాను విడుదల చేసింది. వారిలో 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు, 29 మందితో కో ఆర్డినేషన్, 18 మంది జిల్లాల అధ్యక్షులు (కార్పొరేషన్ ఉన్న నగరానికి ఓ అధ్యక్షుడు, మిగిలిన జిల్లాకు రూరల్ అధ్యక్షుడు), 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. కో ఆర్డినేషన్ కమిటీకి చైర్మన్గా సాకే శైలజానాథ్ వ్యవహరిస్తారు. ఆకమిటీలో సభ్యుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి చోటు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Congress