హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: భారతీయ సంస్కృతికి ఉత్తమ రాయబారి మోదీ.. అందుకు ఈ సాక్ష్యాలే నిదర్శనం..

PM Modi: భారతీయ సంస్కృతికి ఉత్తమ రాయబారి మోదీ.. అందుకు ఈ సాక్ష్యాలే నిదర్శనం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

భారత ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

PM Modi: 2014లో ప్రధానిగా మోదీ(PM Modi) బాధ్యతలు స్వీకరించిన ప్పటి నుంచి భారత సంస్కృతి(Indian Culture), సంప్రదాయాలను ప్రచారం చేయడంపై దృష్టి పెట్టారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

2014లో ప్రధానిగా మోదీ(PM Modi) బాధ్యతలు స్వీకరించిన ప్పటి నుంచి భారత సంస్కృతి(Indian Culture), సంప్రదాయాలను ప్రచారం చేయడంపై దృష్టి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా యోగా (Yoga)ను ప్రచారం చేయడం నుంచి అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయాని (Hindu Temple)కి పునాది వేయడం వరకు ఆయన ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతికి రాయబారిగా పనిచేస్తున్నారు. ఈ రోజు మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి మోదీ కృషి గురించి తెలుసుకుందాం.

* బహుమతులుగా కళారూపాలు

ప్రత్యేకమైన భారతీయ కళారూపాలను ప్రోత్సహించడానికి మోదీ వాటిని ప్రపంచ నేతలకు బహుకరిస్తున్నారు. జులైలో టోక్యోలో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా.. ప్రధాని తన సహచరులకు సాంఝీ కళ, చేతితో చెక్కిన రోగన్ పెయింటింగ్, పట్టమడై సిల్క్ మ్యాట్‌లు, గోండ్ కళతో కూడిన పెట్టెను బహుమతులుగా అందించారు.

తన జపనీస్ కౌంటర్ ఫ్యూమియో కిషిడాకు రోగన్ పెయింటింగ్ ఉన్న చేతితో చెక్కిన చెక్క పెట్టెను బహుమతిగా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంఝీ ఆర్ట్ ప్యానెల్‌ను బహుమతిగా మోదీ ఇచ్చారు. మోదీ ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్‌కు గోండ్‌ ఆర్ట్ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు.

* పశ్చిమాసియాలో దేవాలయాలు(Temples in West Asia)

2015లో తొలిసారిగా పశ్చిమాసియాలో మోదీ పర్యటించిన సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం అబుదాబి సమీపంలో ఒక స్థలాన్ని కేటాయించాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో మోదీ అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశారు.

UAEలోని అబుదాబికి చెందిన BAPS శ్రీ స్వామినారాయణ సంస్థ ఈ మందిరాన్ని నిర్మిస్తోంది. 2018లో మోదీ 1,700 మంది భారతీయ, ఎమిరేట్స్‌ ప్రముఖుల సమక్షంలో సంప్రదాయ రాతి ఆలయ నమూనాను ఆవిష్కరించారు. అబుదాబిలోని మొదటి సంప్రదాయ దేవాలయం రెండు దేశాల మధ్య మానవతా విలువలు, సామరస్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని మోదీ అప్పట్లో అన్నారు.

* రెండో దేశం బహ్రెయిన్‌

2022లో భారతదేశం, UAE మధ్య ఉన్నత స్థాయి పరస్పర చర్చలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. మోదీ జూన్ 28న అబుదాబికి వెళ్లి UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశారు. భారతదేశం, UAE రెండూ వాణిజ్యం, పెట్టుబడి, సంప్రదాయ, పునరుత్పాదక ఇంధనం, ఆహార భద్రత, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య , సంస్కృతి, రక్షణ, అంతరిక్షం సహా విభిన్న రంగాలలో తమ భాగస్వామ్యంతో ముందుకు సాగడానికి కట్టుబడి ఉన్నాయి.

మోదీ తన 2019 పర్యటన సందర్భంగా బహ్రెయిన్‌లోని లార్డ్ శ్రీ కృష్ణ శ్రీనాథ్‌జీ ఆలయ పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించారు. పశ్చిమాసియాలో BAPS స్వామినారాయణ్ సంస్థ సంప్రదాయ ఆలయాన్ని నిర్మించనున్న రెండవ దేశంగా బహ్రెయిన్ నిలిచింది.

ఇది కూడా చదవండి : మీకు ప్రధాని మోదీ గురించి ఈ విషయాలు తెలుసా..?

* యోగా(Yoga) ప్రచారం

5,000 సంవత్సరాల పురాతన భారతీయ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసం యోగాను ప్రమోట్ చేయడంలో మోదీ ముందున్నారు. అధికారం చేపట్టడానికి ముందు కూడా ఆయన యోగాను ప్రోత్సహించారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో మోదీ తన ప్రసంగంలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచనను పంచుకున్నారు. దీంతో మూడు నెలల్లోపు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ UN జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది.

UNలో అప్పటి భారత రాయబారి అశోక్ ముఖర్జీ ప్రవేశపెట్టిన తీర్మానంలో 175 దేశాలు సహ-స్పాన్సర్‌లుగా చేరాయి. ఏ సాధారణ అసెంబ్లీ తీర్మానానికి ఈ స్థాయిలో మద్ధతు లభించలేదు. మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో యోగాను ప్రచారం చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకలు జరిగే ఏకైక రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవమని తాను భావిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చెప్పారు.

First published:

Tags: Narendra Modi Birthday, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు