PM Modi Mother Health Updates: ప్రధాని నరేంద్ర మోదీ తల్లికి అస్వస్థత..పరామర్శించి తిరిగి ఢిల్లీకి మోదీ

PM Narendra Modi Heeraben Modi Health Updates: ప్రధాని నరేంద్ర మోదీ చివరగా గుజరాత్ ఎన్నికల సమయంలో తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని.. తన తల్లి నివాసానికి వెళ్లి.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు.

  • News18 Telugu
  • | December 28, 2022, 17:51 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 5 MONTHS AGO

    AUTO-REFRESH

    Highlights

    18:26 (IST)

    ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

    17:53 (IST)

    తల్లి హీరాబెన్ ను హాస్పిటల్ లో పరామర్శించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి బయలుదేరారు.

    17:47 (IST)

    తల్లి హీరాబెన్ ను హాస్పిటల్ లో పరామర్శించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి బయలుదేరారు.

    17:14 (IST)

     ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ మేరకు అఖిలేష్ యాదవ్ ఈ ట్వీట్ చేశారు.


    17:3 (IST)

     ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ త్వరగా కోలుకోవాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఆకాంక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఈ ట్వీట్ చేశారు.


    16:41 (IST)

    ప్రధాని మోదీ తల్లి పరిస్థితి తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.

    16:26 (IST)

    తల్లి హీరాబెన్‌ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు.

    16:23 (IST)

    తల్లి హీరాబెన్‌ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు.

    16:9 (IST)

     ప్రధాని మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

    16:4 (IST)

    ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు బయలుదేరారు. ఐదు నిమిషాల్లో ప్రధాని ఆసుపత్రికి చేరుకుంటారు.

    Narendra Modi Mother Health Update: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (Heeraben Modi)కి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండడంతో..  కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రి (UN Mehta hospital)కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఈ ఏడాది (2022) జూన్ 18న ఆమె వందో ఏట అడుగుపెట్టారు. ఆమె 1923 జూన్‌ 18న జన్మించినట్లు ప్రధాని సోదరుడు పంకజ్‌ మోదీ తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత జీవితంలో ఆయన తల్లి హీరాబెన్ మోదీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో మోదీ.. గుజరాత్ .. గాంధీనగర్‌లోని తల్లి హీరాబెన్ మోదీని కలుస్తారు. ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ చివరగా గుజరాత్ ఎన్నికల సమయంలో తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ప్రధాని.. తన తల్లి నివాసానికి వెళ్లి.. ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపు అక్కడే ఉండే.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. తల్లీ, కొడుకులు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇలా ఈ తల్లీకొడుకుల బంధం.. ప్రేమానురాగాలతో నిండి ఉంటుంది.

    మోదీ సోదరుడికి రోడ్డు ప్రమాదం :

    మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) సోదరుడు ప్రహ్లాట్ మోదీ ప్రయాణిస్తున్న కారుకు నిన్న ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాద సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ (Prahlad Modi) భార్య, కొడుకు, కోడలు ఉన్నట్టు తెలిసింది. ఆయన కుటుంబం మైసూరు (Mysuru) సమీపంలోని బండిపురాకు వెళుతుండగా.. కడకోల సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఘటన తర్వాత ప్రహ్లాద్ మోదీ, ఆయన కుమారుడు మెహుల్ మోదీ, కోడలు జిందాల్ మోదీ, మనవడు మెహత్, కారు డ్రైవర్ సత్యనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.