హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi | Pune Metro : పుణె మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ.. టికెట్ కొని తొలి ప్రయాణం.. సీఎం ఠాక్రే డుమ్మా

PM Modi | Pune Metro : పుణె మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ.. టికెట్ కొని తొలి ప్రయాణం.. సీఎం ఠాక్రే డుమ్మా

పుణె మెట్రో ప్రారంభించిన ప్రధాని

పుణె మెట్రో ప్రారంభించిన ప్రధాని

మహారాష్ట్రలో రెండో అతిపెద్ద నగరం పుణెలో మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పుణె మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

భారత ఉపరితల రవాణా కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరింది. దేశ ప్రజారవాణా వ్యవస్థలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆరంభమైంది. మహారాష్ట్రలో రెండో అతిపెద్ద నగరం పుణెలో మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు పుణె మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో పచ్చ జెండా ఊపి రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని.. టికెట్ కొనుక్కొని మరీ తొలి ప్రయాణం చేశారు. మెట్రో రైల్ సేవలతోపాటే పుణెలో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్ధాపనలు చేశారు.

పుణె పర్యటన కోసం ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. తొలుత పుణె మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(పీఎంసీ) కార్యాలయం వద్ద ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్కరించారు. 9.5 అడుగుల ఎత్తుతో ఈ విగ్ర‌హాన్ని పీఎంసీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే, గ‌ర్వారే మెట్రో స్టేషన్ కు చేరుకున్న ప్రధాని అక్కడ పచ్చ జెండా ఊపి పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

పుణె మెట్రో రైల్ టికెట్ కొంటున్న ప్రధాని

RS Praveen kumar: ముందస్తుకు BSP వ్యూహం.. బహుజన రాజ్యాధికార యాత్ర షురూ.. 300రోజులపాటు


టికెట్ కొనుక్కొని మరీ రైలెక్కిన ప్రధాని మోదీ... గ‌ర్వారే మెట్రో స్టేష‌న్ నుంచి ఆనంద్ న‌గ‌ర్ స్టేష‌న్ వ‌ర‌కు సామాన్యులతో కలిసి ప్రయాణించారు. మెట్రో రైలు రాక‌తో పుణేలో అర్బ‌న్ మొబిలిటీ కోసం అంత‌ర్జాతీయ శ్రేణి మౌలిక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినట్లయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగానే పుణె మెట్రో రైల్ ప్రాజెక్టుకు 2016 డిసెంబ‌ర్ 24న పురుడుపోసుకుంది. ఈ ప్రాజెక్టు అంచనా రూ 11,440 కోట్లు. సిటీలో మొత్తం 32.2 కిలోమీట‌ర్ల ప‌రిధిలో మెట్రో రైల్ నిర్మితమ‌వుతుండ‌గా తొలి 12 కిలోమీట‌ర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. కాగా,

పుణె మెట్రోలోకి మోదీ.. ప్రయాణం వీడియో కింద చూడొచ్చు..

Russia Ukraine War: రష్యా యుద్ద విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్.. బందీగా పైలట్ - Viral Video


పుణె మెట్రో రైల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ, కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ప్రధానితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, చివరి నిమిషంలో మిన్నకుండిపోయారు. గవర్నర్ల వ్యవస్థను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందంటూ విపక్ష సీఎంలు చేస్తోన్న ఆందోళనలో మహా సీఎం ఠాక్రే కీలక భూమిక పోషిస్తోన్న క్రమంలో పుణె మెట్రో ప్రారంభోత్సవారానికి ఆయన రాకపోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

First published:

Tags: Metro Train, Pm modi, Pune

ఉత్తమ కథలు