PADMA BHUSHAN BUDDHADEB BHATTACHARYA REFUSES TO ACCEPT THE PADMA BHUSHAN EVK
Padma Bhushan: పద్మభూషణ్ వద్దు.. అవార్డును తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి
బుద్ధదేవ్ భట్టాచార్య (ఫైల్)
Buddhadeb Bhattacharya | గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం మంగళవారం ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ అవార్డు లభించనుంది. అయితే ఆయన దానిని నిరాకరించారు.
గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం మంగళవారం ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharya) కు పద్మభూషణ్ అవార్డు లభించనుంది. అయితే, పేర్లను ప్రకటించిన కొద్ది గంటలకే, సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు సన్మానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. ఇతర పద్మ అవార్డు గ్రహీతలలో, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (Kalyan Singh) , మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్లకు పద్మ విభూషణ్ను అందజేయనున్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, ఎస్ఐఐ ఎండీ సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ను ప్రదానం చేయనున్నారు. కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, అతని సహ వ్యవస్థాపకురాలు భార్య సుచిత్రా ఎల్లా ఉన్నారు.
CDS Gen Bipin Rawat to get Padma Vibhushan (posthumous), Congress leader Ghulam Nabi Azad to be conferred with Padma Bhushan pic.twitter.com/Qafo6yiDy5
17 మందికి పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. వీరిలో బెంగాల్కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్రకు చెందిన నటరాజన్ చంద్రశేఖరన్, సైరస్ పూనావాలా, యూపీ నుంచి రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, తెలంగాణ నుంచి కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, రాజస్థాన్ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు సత్యా నాదేళ్ల, సుందర్ పిచాయ్, మెక్సికోకు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) ఉన్నారు.
మరో 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులకు పద్మ భూషణ్ అవార్డులు రాగా.. గరికపాటి నరసింహారావు, పద్మజారెడ్డి, రామచంద్రయ్య, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్(మరణానంతరం) పద్మశ్రీ అవార్డులకు ఎంపిక అయ్యారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.