హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నేటి నుంచే రైల్వే టికెట్ బుకింగ్స్.. జూన్ 1 నుంచి నడిచే రైళ్లు ఇవే

నేటి నుంచే రైల్వే టికెట్ బుకింగ్స్.. జూన్ 1 నుంచి నడిచే రైళ్లు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జనరల్ బోగీలకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ (2s) చార్జీలను వసూలు చేస్తారు.

లాక్‌డౌన్-4లో రైల్వేశాఖకు మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. హోంశాఖ, వైద్యఆరోగ్యశాఖ సూచనలతో జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మొత్తం 200 రైళ్లకు (100 జతలు) సంబంధించిన వివరాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఈ నెల 21 (గురువారం) ఉదయం 10 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లన్నింటినీ ప్రత్యేక రైళ్లగానే పరిగణిస్తారు. ఈ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ఐతే జనరల్ బోగీలకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ (2s) చార్జీలను వసూలు చేస్తారు. ఈ రైళ్ల బుకింగ్స్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉటుంది. ఐతే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన వారిని రైళ్లలోకి అనుమతించరు.

జూన్ 1 నుంచి నడిచే రైళ్ల వివరాలు:

రైళ్ల జాబితా

రైళ్ల జాబితా

First published:

Tags: Indian Railway, Irctc, Lockdown, Special Trains

ఉత్తమ కథలు