దేశంలో కోవిడ్ వ్యాప్తి (Covid 19) తీవ్రం అవతుంది. ఢిల్లీలో ఇప్పటికే కేసుల సంఖ్య తీవ్రం అవతుండగా తాజాగా మరో రాష్ట్రంలో వింత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రం పంజాబ్ (Punjab) లో కోవిడ్ కేసులు బాగా పెరగడమే కాకుండా.. గడిచిన 24 గంటల్లో ఆక్సిజన్ తీసుకునే రోగుల సంఖ్య పెరగడం ఆందోళనకు కారణం. శనివారం విడుదల చేసిన రాష్ట్ర మెడికల్ బులెటిన్ ప్రకారం, శుక్రవారం కేవలం 62 మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్ (Oxygen Support) లో 226 మంది ఉన్నారు. ఇది కేవలం 24 గంటల్లో 264% పెరిగింది. జనవరి 1న కేవలం 23 మంది రోగులు మాత్రమే ఆక్సిజన్ సపోర్ట్లో ఉన్నారు. రాష్ట్రంలో శుక్రవారం 2,901కి వ్యతిరేకంగా 3,643 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
అంతే కాకుండా లెవల్-3 స్థాయిలో ఉన్నన రోగుల సంఖ్య శుక్రవారం 20 నుండి శనివారం 55కి పెరిగింది, ఇది 175% పెరిగింది. అదే సమయంలో, వెంటిలేటర్పై ఉన్న రోగులు 6 నుంచి 11కి చేరుకున్నారు. జనవరి 1న, రోగులెవరూ వెంటిలేటర్ సపోర్ట్లో లేరు మరియు ఎనిమిది మంది రోగులు మాత్రమే లెవల్ 3 సపోర్ట్లో ఉన్నారు. రాష్ట్ర కరోనా పాజిటివిటీ రేటు శుక్రవారం 11.75% ఉండగా శనివారం 14.64%కి చేరుకుంది. జనవరి 1న, సానుకూలత రేటు 2.02%. పాటియాలా (840), మొహాలి (563), లూథియానా (561), అమృత్సర్ (346)లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
WHO: ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదు అనేది అవాస్తవం.. జాగ్రత్త తప్పని సరి: డబ్ల్యూహెచ్ఓ
దేశంలో కరోనా కేసులు (Corona Cases) రోజురోజుకు పెరగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీ (Delhi) లో పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. కరోనా కేసుల కారణంగా ఏయిమ్స్ వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. తాజగా సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు సున్నితమైన హెచ్చరింక చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ విధంచడం లేదని అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి.. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తే మంచిదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే లాక్డౌన్ (Lock Down) తప్పదని స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్నంత మాత్రానా భయ పడాల్సిన అవసరం లేదని అన్నారు. సమిష్టిగా కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని అన్నారు.
Covid-19 Affects Studies: కరోనాకి న్యూటన్కు లింక్ పెట్టేశాడు.. వైరల్ అవుతున్న స్టూడెంట్ థియరీ!
ఒమిక్రాన్ సోకిన వారిలో ఎక్కువగా గుర్తించిన లక్షణాలు
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.