ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థలు (డిస్కంలు) ప్రైవేటీకరిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాలుగు రోజులుగా వివిధ రంగాలకు సంబంధించిన ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటిస్తున్న నిర్మలా సీతారామన్ ఈరోజు 8 గంటలకు సంబంధించిన సంస్కరణలను ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించారు. డిస్కంలు ఆర్థిక భారంతో సతమతం అవుతున్నాయని, వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం ఇచ్చిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి వాటిని బయటపడేయాలంటే ఇదే సరైన మార్గం అని ప్రకటించారు. అలాగే, స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లను కూడా ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
కేంద్ర పాలిత ప్రాంతాలు
జమ్మూ కాశ్మీర్
లఢక్
దాద్రా నాగర్ హవేలీ
ఢిల్లీ
చండీగఢ్
అండమాన్ నికోబార్ దీవులు
పుదుచ్చేరి
లక్షద్వీప్
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.