నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహారు జైలులో ఈ తెల్లవారు జామున ఉరి తీశారు. అయితే ఉరి తీసే ముందు దోషులకు చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి పూరీ, సబ్జి, కచోరీ తినిపించాలని ఉందని జైలు అధికారులను కోరినట్లు సమాచారం అందుతోంది. అలాగే మిగితా దోషులకు గత రాత్రి మంచి భోజనం ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. శుక్రవారం ఉదయం ఉరి తీయడానికి ముందు చివరి కోరిక ఏమిటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తిహార్ సెంట్రల్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు.
ఇదికూడా చూడండి :
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya, Nirbhaya case