తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరి అమలైంది. ఉరితీత అనంతరం వైద్యుల ధ్రువీకరణ అనంతరం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దోషుల మృత దేహాలను ఆసుపత్రికి తరలించగా, అక్కడే పోస్టు మార్టం నిర్వహించనున్నారు. పోస్టు మార్టం చేసే సమయంలో వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒకే రోజు నలుగురు దోషులకు ఉరితీసిన రికార్డు తీహార్ జైలు పేరిట నమోదు అయ్యింది. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. జైలు నెంబర్ 3 సూపరిండెంట్ సునీల్, ఎడిషనల్ ఐజీ (జైల్) అలాగే రాజ్ కుమార్ శర్మ, జైలు లీగల్ ఆఫీసర్ గత 24 గంటలుగా నిద్రాహారాలు మాని ఉరి తీసేందుకు సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. అయితే ఉరి తీసే ముందు నిర్భయ దోషులు రాత్రంతా రోదించారని, నిద్ర పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఉరి నేపథ్యంలో అన్ని బ్యారక్ లను మూసివేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
ఉరిశిక్ష విధించిన సందర్భంగా తిహార్ జైలులో ఉన్న తోటి ఖైదీలందరినీ లాకప్ గదుల్లో మూసి ఉంచారు. తిహార్ జైలులో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు నిర్భయ దోషులను ఉరి తీసే గంట ముందు లాకప్ గదులన్నింటినీ మూసివేశారు. నలుగురికి ఉరి తీశాక తిహార్ జైలు లాకప్ గదులను తెరిచారు. అప్పటివరకు ఖైదీలందరినీ నిర్బంధంలో ఉంచారు.
Delhi: Bodies of 2012 Delhi gangrape case convicts brought to DDU Hospital for postmortem; The postmortem will be done as recommended by the Jail manual and Supreme Court guidelines. After the postmortem, the bodies of the convicts will be handed over to their respective families https://t.co/jOl8mqQQDB pic.twitter.com/lxONR632J7
— ANI (@ANI) March 20, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya, Nirbhaya case