496 సంవత్సరాల తరువాత రామజన్మభూమి ఆలయం సిద్ధంగా ఉంటుందని.. తదుపరి రామ నవమి వేడుకలు అయోధ్యలో జరుగుతాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ (Hardeep Singh Puri) పూరి అన్నారు. గురువారం జరిగిన రైజింగ్ ఇండియా కాన్క్లేవ్ (Rising India Conclave) మూడవ ఎడిషన్లో ఆయన పాల్గొన్నారు. 1947 నుండి మే 2014 వరకు పట్టణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఆలయమైనా, పట్టణ ప్రాంతంలో ఏం జరుగుతోందో లెక్కలు చెబుతున్నాయని చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్ పథకం కింద 2004 నుంచి 2014 మధ్య కాలంలో నిర్మించిన ఇళ్ల సంఖ్య 13.46 లక్షలు కాగా, మోదీ(PM Modi) ప్రభుత్వ హయాంలో ఎనిమిదేళ్లలో 1.22 కోట్లకు చేరుకుందని తెలిపారు. ఇది తొమ్మిది రెట్లు ఎక్కువని వ్యాఖ్యానించారు.
ఆ 10 ఏళ్లలో హౌసింగ్లో పెట్టుబడి రూ. 20,303 కోట్లు అని.. ఆ తరువాత రూ. 2 లక్షల కోట్లు పెట్టామని అన్నారు. ఇది 10 రెట్లు ఎక్కువ అని అన్నారు. మొత్తం పట్టణ వ్యయం రూ.1.57 లక్షల కోట్లు కాగా అది రూ.17 లక్షల కోట్లకు పైగా చేరిందని అన్నారు. అర్బన్ స్పేస్పై మోదీ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడుతోందని అన్నారు. 2014లో భారతదేశంలో మెట్రో యొక్క మొత్తం కిలోమీటరు 229 కి.మీలు కాగా, నేడు 850 కి.మీలు పని చేస్తున్నాయని అన్నారు. మరో 1,050 కి.మీ నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. నేడు దేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద మెట్రో వ్యవస్థ అని.. కొన్ని నెలల్లో మనం మూడవ అతిపెద్ద మెట్రో వ్యవస్థగా మారతామని అన్నారు.
వచ్చే ఏడాది చివరి నాటికి చైనా తర్వాత మనమే రెండో అతిపెద్ద దేశంగా నిలుస్తామని అన్నారు. ఇది ప్రధాని మోదీ కృషి ఫలితమే అని అన్నారు. హెరిటేజ్పై జరుగుతున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. ఒక్క హెరిటేజ్ భవనాన్ని కూడా నేలమట్టం చేయబోమన్నారు. శాశ్వతమైన చారిత్రక విలువ ఏదీ లేదని.. మనది బలమైన ప్రజాస్వామ్యం, చాలా శక్తివంతమైనదని అన్నారు. రాహుల్ గాంధీ వ్యవహారంపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూర్తి స్పందించారు. వీర్ సావర్కర్ ఉన్నత స్థాయిని త్యాగం చేశారని.. జీవిత ఖైదు అనుభవించారని అన్నారు.
Madhya Pradesh: ఇండోర్ ఆలయంలో ఘోర ప్రమాదం.. మెట్ల బావి కూలి 13 మంది మృతి
Rising India Summit: రాజస్థాన్ సీఎం గెహ్లోత్కు ముప్పు తప్పదని అర్థమైంది..కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
గాంధీజీ ఒక వర్గానికి చెందిన ముగ్గురి పేర్లను పెట్టారు. ఇది నమ్మశక్యం కాదు. సంఘంలోని ఒక సభ్యుడు న్యాయపరమైన ఆశ్రయాన్ని కోరాడని.. దోషిగా నిర్ధారించబడ్డాడని అన్నారు. ఆయన క్షమాపణ చెప్పవచ్చు లేదా న్యాయపరమైన ఆశ్రయాన్ని కోరవచ్చని అన్నారు. అయితే ఇందుకు బదులుగా నల్లటి దుస్తులు ధరించే ఫ్యాషన్ షోలు, ఇతర రకాల మెలోడ్రామాటిక్స్ ఉన్నాయని ఆరోపించారు. అనర్హత వేటు పడిన తొలి రాజకీయ నాయకుడు ఆయనొక్కడే కాదని అన్నారు. గతంలో 17 మందిని అనర్హులుగా ప్రకటించబడ్డారని గుర్తు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya Ram Mandir