క్రికెటర్ నుంచీ రాజకీయ నేతగా మారిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. బీహార్ లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న ఆయన... ముస్లింలు కాంగ్రెస్కి ఓటు వేయాలనీ, తద్వారా ప్రధాని మోదీ అధికారంలోకి రాకుండా చెయ్యాలని కోరారు. కతిహార్లో ర్యాలీ నిర్వహిస్తూ ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెటరన్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్ తరపున ప్రచారం చేస్తూ... ఆయన చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడుతోంది. మతపరంగా ఓట్లు కోరడం ఎన్నికల కోడ్కి వ్యతిరేకమన్న ఆ పార్టీ నేతలు... కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్న సుమోటోగా తీసుకొని... సిద్ధూపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్ధూ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. బీహార్లోని సీమాంచల్ ఏరియాలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన పంజాబ్ మంత్రి కూడా ఈ వీడియోలో ఉన్నారు. కతియార్తోపాటూ పక్కనే ఉన్న కిషన్గంజ్లో ముస్లింల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఎంఐఎం తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇలాంటి వ్యాఖ్యలే చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మరి సిద్ధూపైనా చర్యలుంటాయా అన్నది రెండ్రోజులలో తేలనుంది.
ఇవి కూడా చదవండి :
దయచేసి అలాంటి వార్తలు ఇవ్వొద్దు... మీడియాకు తెలంగాణ సీఈసీ రజత్ కుమార్ వినతి
అంబటి రాయుడు త్రీడీ గ్లాసెస్ ట్వీట్... టీంఇండియా సెలెక్టర్లపై సెటైర్ వేసేశాడుగా...
తమిళనాడులో ఐటీ దాడులు... చంద్రబాబు టార్గెట్గా చేయించారా...
మాయావతి షూస్ పాలిష్ చేసేలా చేస్తాను... మరో వివాదంలో అజంఖాన్...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Navjot Singh Sidhu