కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి అనుకూలంగా 126, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. మొత్తం 451 ఓట్లు పోలయ్యాయి. శివసేన, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ ఎంపీలు గైర్హాజరయ్యారు. 37 మంది ఎంపీలు ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి అండగా నిలబడింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో ప్రభుత్వానికి 325 ఓట్లు వచ్చాయి. దీంతో మోదీ ప్రభుత్వ ఫుల్ ఖుషీలో ఉంది. శివసేనతో కలసి ఎన్డీయేకు 314 మంది ఎంపీల బలం ఉంది. అయితే, వారు సడన్గా సభకు రాకూడదని నిర్ణయించి బీజేపీ నెత్తిన పాలు పోసింది. అదే సమయంలో తటస్థంగా ఉంటుందనుకున్న అన్నాడీఎంకే మోదీకి జై కొట్టింది. దీంతో అనుకున్నదాని కంటే అదనంగా మద్దతు సాధించింది ఎన్డీయే ప్రభుత్వం.
మొత్తానికి 2019 ఎన్నికల్లో ఎవరు ఎటువైపు నిలుస్తారని చెక్ చేసుకునేందుకు ఈ అవిశ్వాస తీర్మానం ఉపయోగపడింది. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ శ్రమించినా.. అనూహ్యంగా బీజేపీకే మద్దతు పెరిగింది. టీఆర్ఎస్ మాత్రం చివరి నిమిషంలో సభ నుంచి వాకౌట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp-tdp, Chandrababu Naidu, Narendra modi