హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మేము రాముడి వంశస్తులం.. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి : మహేంద్ర సింగ్

మేము రాముడి వంశస్తులం.. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి : మహేంద్ర సింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జైపూర్ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా తాము రాముడి కుమారుడైన కుషుడి వంశస్తులమని తెలిపారు. దానికి సంబంధించి ప్రాచీన సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు.

తాము శ్రీరాముడి వారసులమని మరో రాజ కుంటుంబం ప్రకటించింది. మేవార్ ఉదయ్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన మహేంద్ర సింగ్ సోమవారం ఈ ప్రకటన చేశారు. జైపూర్ బీజేపీ ఎంపీ దియా కుమారి.. తాము శ్రీరాముడి కుమారుడైన కుషుడి వారసులమని తెలిపిన మరునాడే మహేంద్ర సింగ్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అయోధ్య రామ మందిర వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీం.. రాముడి వంశానికి చెందిన రఘువంశస్తులు ఇప్పటికీ ఎవరైనా అయోధ్యలో ఉన్నారా..? అని ఆరా తీయడంతో.. వీరంతా తెర పైకి వస్తున్నారు.

మేము శ్రీరాముడి వంశస్తులమనేది చారిత్రకంగా నిరూపితమైంది. అలా అని రామ జన్మభూమి మాదే అని చెప్పడం లేదు. కానీ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కోరుకుంటున్నాం.ఇటీవల సుప్రీంకోర్టు రఘువంశస్తుల గురించి ఆరా తీసినట్టు మీడియా ద్వారా తెలిసింది. అదే నిజమైతే కోర్టు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలను మేము న్యాయస్థానానికి అందజేస్తాం.
మహేంద్ర సింగ్,మేవార్ ఉదయ్‌పూర్ రాజవంశీయుడు

జైపూర్ బీజేపీ ఎంపీ దియా కుమారి కూడా తాము రాముడి కుమారుడైన కుషుడి వంశస్తులమని తెలిపారు. దానికి సంబంధించి ప్రాచీన సాక్ష్యాధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు. అంతేకాదు, రాముడి మరో కుమారుడైన లవ వారసులుగా రాథోడ్స్ ప్రకటించుకున్నారని చెప్పారు. రామ మందిర విచారణలో తాను జోక్యం చేసుకోబోనని.. అయితే న్యాయస్థానం అడిగితే తమ వద్ద ఉన్న ఆధారాలను అందజేస్తామని అన్నారు.

First published:

Tags: Ayodhya, Ayodhya Ram Mandir, Babri masjid, Supreme Court

ఉత్తమ కథలు