MAHARASHTRA ROAD TRANSPORT CORPORATION HAS SUSPENDED 6277 EMPLOYEES AFTER GOING ON STRIKE FOR A MONTH PRV
MSRTC strike: ఆర్టీసీలో సమ్మె చేసిన ఉద్యోగులపై కొరడా.. 6,277 మంది సస్పెండ్.. 1496 మంది డిస్మిస్
ఆర్టీసీ బస్సు
రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. దాదాపు 250కి పైగా డిపోలలో సమ్మె ప్రభావం కనిపించింది. దీంతో ప్రభుత్వం కొరడా ఝులిపించింది.
మహారాష్ట్ర (Maharashtra) లో ఎమ్మెస్సార్టీసీ (MSRTC)కి చెందిన ఉద్యోగులు గత అక్టోబర్ 28 నుంచి సమ్మె (strike) చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 6,277 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ (Suspended) చేసింది. రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు గత నెల రోజులుగా సమ్మె (MSTRC Strike) నిర్వహిస్తున్నారు. దాదాపు 250కి పైగా డిపోలలో సమ్మె ప్రభావం కనిపించింది. అయితే బస్సులు (busses) ఎక్కువగా తిరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు (passengers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్మిక సంఘాలతో సమావేశం..
అయితే ఈ సమ్మె (strike) లో పాల్గొంటున్న ఉద్యోగులపై మహారాష్ట్ర ఆర్టీసీ మండిపడింది. వారిపై క్రమ శిక్షణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా శనివారం 3,010 మంది ఉద్యోగులను సస్సెండ్ చేస్తూ నిర్ణయం (decision) తీసుకుంది. మరో 270 మంది కార్మికులను విధుల నుంచి తొలగించింది. దీంతో ఇప్పటి వరకు సస్సెండ్ అయిన ఉద్యోగుల సంఖ్య 6,277కి చేరగా, 1496 మంది కార్మికులు ఉపాధి (Employment) కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులు (employees) వెంటనే విధుల్లో చేరాలని, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉద్యోగుల జీతాల పెంపు..
ఇక మొత్తం 92,266 మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో (RTC employees) 18 వేల వరకు తిరిగి శనివారం విధుల్లో చేరారు. అయితే ఇంకొందరు డ్యూటీ (Duty)లో చేరేందుకు ఈ రోజు వరకు సమయం ఇచ్చింది ప్రభుత్వం.
— Maharashtra State Road Transport Corporation (@msrtcofficial) November 24, 2021
అలాగే ఉద్యోగుల జీతాల పెంపు (salaries hike) విషయంలో సమీక్షించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వారం ప్రారంభంలో ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటించడంతో పలువురు ఉద్యోగులు విధుల్లో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని మంత్రి (minister) అనిల్ పరబ్ తెలిపారు.
मागील काही दिवसांपासून एसटी कर्मचारी आंदोलन करत होते. त्याबाबतीत सरकारने सकारात्मक पाऊल उचलले असून काल कर्मचाऱ्यांच्या वेतनात घसघशीत वाढ करण्याचा निर्णय घेण्यात आला आहे. चालक, वाहक, यांत्रिकी कर्मचारी व लिपिक यांच्या वेतनात ऐतिहासिक अशी ७२०० ते ३६०० रुपयांची वाढ करण्यात आली आहे.
కొందరు ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారు కూడా వెంటనే చేరాలని మంత్రి కోరారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.