హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: వామ్మో.. 1400 మంది బాలికలకు ఎగ్జామ్ లో సున్నా మార్కులు.. ఎక్కడంటే..

OMG: వామ్మో.. 1400 మంది బాలికలకు ఎగ్జామ్ లో సున్నా మార్కులు.. ఎక్కడంటే..

నిరసన చేపట్టిన విద్యార్థులు

నిరసన చేపట్టిన విద్యార్థులు

Madhya Pradesh: బాలికలంతా ప్రభుత్వ బాలికల కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. బీఏ మొదటి సంవత్సరం ఫలితాల్లో అందరికి ఏదో ఒక సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చాయి. ఈ విషయమై కళాశాల యాజమాన్యంతో పలుమార్లు మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు.  

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Madhya Pradesh, India

మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) సత్నాలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. సోమవారం సాత్నాలో స్థానిక కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులు రోడ్డు మార్గంలో కూర్చున్నారు. వాహనాలు వెళ్లకుండా అడ్డుకుని తమ నిరసనను తెలియజేశారు. కొంత సేపు విద్యార్థినులు నినాదాలు చేయడంతో పాటు,   ఒక్కసారిగా అక్కడి నుంచి వెళ్లే వాహనాలను ఆపడం ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రి, స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై విద్యార్థినులు బైఠాయించారు. కాసేపటి తర్వాత..  ట్రాఫిక్‌ పోలీసులు నచ్చజెప్పి ట్రాఫిక్‌ జామ్‌ను తొలగించారు.

నిరసన తెలిపిన బాలికలంతా ప్రభుత్వ బాలికల కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. వాస్తవానికి, ఈ విద్యార్థినులు తమ భవిష్యత్తు గురించి ఈ ఆందోళన చెపట్టినట్లు తెలుస్తోంది. కాగా, బీఏ మొదటి సంవత్సరం ఫలితాల్లో దాదాపు అందరికి.. ఏదో ఒక సబ్జెక్టులో సున్నా మార్కులు వచ్చాయి. ఈ విషయమై కళాశాల యాజమాన్యంతో పలుమార్లు మాట్లాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థినులు సోమవారం కళాశాల నుంచి బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించి రోడ్డుపై బైఠాయించారు.

సున్నా మార్కులు ఎలా

బీఏ మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. దీనిలో దాదాపు 1400 మందికి ఎదో ఒక సబ్జెక్ట్ లో సున్నా మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుందంటూ స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కళాశాల ప్రిన్సిపాల్ నీలం రిచారియా, ఇతర ప్రొఫెసర్‌లను కలిసి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పరిష్కరించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం వీధుల్లోకి రావాల్సి వచ్చిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫలితాలు మెరుగుపడతాయి: ప్రిన్సిపాల్

కాలేజీలో 1400 మంది విద్యార్థినులు ఉన్నారని, వారి ఫలితాలు తప్పుగా ఉన్నాయని నిరసనకు దిగిన విద్యార్థిని ఒకరు తెలిపారు. కాలేజీ యాజమాన్యం వెంటనే ఫలితాలు మరోసారి సరిగ్గా చూసుకొవాలని విద్యార్థులు కోరారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ నీలం రిచారియా మాట్లాడుతూ బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు ఉన్నారని, వీరి ఫలితాలు అనుబంధంగా వచ్చాయన్నారు. ఎగ్జామ్ లకు సంబంధించి,  అవధేష్ ప్రతాప్ సింగ్  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే విశ్వవిద్యాలయానికి పలుసార్లు లేఖలు రాశాము. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా..  బాలికల ఫలితాలు మెరుగుపడతాయని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First published:

Tags: Madhya pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు