కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇడుక్కి జిల్లాలోని మున్నార్కు సమీపంలో రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. కొండ చరియలు విరిగిపడి 31 గుడిసెలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. 15 మంది మృతదేహాలు శిథిలాల కింద వెలికితీయగా...మరో 57 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 12 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. వీరిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురైయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
కేరళలో కొండ చరియలు విరిగిపడి 15 మంది మృతిఘటనా స్థలి వద్ద నాలుగు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో రిస్క్యూ ఆపరేషన్కి విఘాతం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రిస్క్యూ ఆపరేషన్లో పాలుపంచుకుంటున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. త్రిశూర్ నుంచి మరో ఎన్డీఆర్ఎఫ్ దళం ఘటనా స్థలికి వెళ్తున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
A 50 member strong special task force team of the Fire Force has been dispatched to Rajamalai in Idukki for rescue efforts. They have been equipped for nighttime rescue activities. #KeralaRains pic.twitter.com/olo1eraMNV
— Pinarayi Vijayan (@vijayanpinarayi) August 7, 2020
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు తలా రూ.50 వేల పరిహారం ప్రకటించారు.
Pained by the loss of lives due to a landslide in Rajamalai, Idukki. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover quickly. NDRF and the administration are working on the ground, providing assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 7, 2020
అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
కేరళ దుర్ఘటన...ఫోటో గ్యాలరీ..
భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఇతర జిల్లాల్లో కొండ దిగువ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala rains