రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ (Railway Ministry) బ్యాడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో దెబ్బతిన్న రైల్వే శాఖ ఆర్థికంగా మెరుగయ్యేందుకు చార్జీలు పెంచుతోంది. తాజాగా కొత్త రూల్ ప్రకారం స్టేషన్ డెవలప్మెం ట్ ఫీజు (station development fee) పేరుతో ప్రయాణికుల వద్ద నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇకపై టికెట్తోపాటు అదనంగా రూ.10 నుం చి రూ.50 వరకు ఈ చార్జీలను వసూలు చేయనున్నట్టు రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఫీజు మూడు క్యాటగిరీల్లో ఎస్డీఎఫ్ వసూలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫీజుల వివరాలు ఏసీ రైల్కైతే రూ.50, క్లాస్కి రూ.25, అన్ రిజర్వ్డ్ క్లాస్కి రూ.10 చొప్పున ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్టు సమాచారం.
అయితే ఈ స్పెషల్ ఫీజు (Special Fee) నుంచి సబర్బన్ రైళ్ను మినహాయింపు ఇస్తున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. అంతే కాకుండా ప్లాట్ఫాం టికెట్ (Platform Ticket) ధర కూడా రూ.10 కూడా పెరుగనుంది. అంతే కాకుండా రైల్వే స్టేషన్లయితే నిర్దేశించిన దానికంటే 1.5 రెట్లు భారం అధికంగా ఉంటుంది’’ అని రైల్వే బోర్డు ఆ సర్క్యు లర్లో పేర్కొం ది. స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు వల్ల రైల్వే ఆదాయం పెరగడంతో పాటు, ప్రైవేటు వ్య క్తులను ఆకర్షిం చడానికి ఉపయోగపడుతుందని సీనియర్ అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు 200 రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ కియోస్క్లను రైల్ టెల్ ఏర్పాటు చేస్తుంది. వీటిలో అత్యధికం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. ఆధార్ (Aadhaar Card), పాన్ కార్డు(Pan Card)ల్లో మార్పులు చేర్పులు చేయడం కామన్ అయిపోయింది. పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి చాలా ఈజీగా ఈ సేవలు అందుతున్నాయి.
కానీ ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరికీ రైల్వేశాఖ (Indian Railways) శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు.. పాన్ కార్డ్ సంబంధించి ఏదైనా అప్డేట్ చేయాలనుకునే వారు..
Covid 19 Vaccine: తగ్గేదేలే.. ఐదు రోజుల్లో రెండు కోట్ల డోసులు.. టీనేజర్లకు జోరుగా వ్యాక్సిన్లు
ఇకపై ఆధార్ సేవా కేంద్రం, మీ-సేవల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లోనే మీకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా ఈ సేవలు మీకు లభిస్తాయి. పైలట్ ప్రాజెక్టుగా మొదట వారణాసి, ప్రయాగ్రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను రైల్వేశాఖ ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Railway station, Travel