హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agni-4 మిసైల్ ప్రయోగం విజయవంతం....పాక్,చైనాలోని ఏ నగరాన్నైనా 20 నిమిషాల్లో మటాష్!

Agni-4 మిసైల్ ప్రయోగం విజయవంతం....పాక్,చైనాలోని ఏ నగరాన్నైనా 20 నిమిషాల్లో మటాష్!

అగ్ని 4 మిసైల్ ప్రయోగం విజయవంతం

అగ్ని 4 మిసైల్ ప్రయోగం విజయవంతం

Agni 4 Missile Test : పరిజ్ఞానంతో రూపొందించిన శక్తివంతమైన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి IRBM బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4ను సోమవారం ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది.

ఇంకా చదవండి ...

Agni 4 Missile Test : పరిజ్ఞానంతో రూపొందించిన శక్తివంతమైన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి IRBM బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4(Agni-4)ను సోమవారం ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా(Odisha)లోని చాందీపూర్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపంలో(APJ Abdul Kalam Island) సోమవారం రాత్రి 7.30 గంటలకు అగ్ని-4 పరీక్ష జరిగింది. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని అధికారులు చెప్పారు. ఇది మూడవ తరం అత్యంత అధునాతన మరియు ప్రాణాంతక క్షిపణి, ఇది కేవలం 20 నిమిషాల్లో చైనా-పాకిస్తాన్‌లోని ఏదైనా నగరాన్ని పేల్చివేయగలదు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని రక్షణ వర్గాలు తెలిపాయి. దీనిని DRDO అభివృద్ధి చేసింది.


అగ్ని-4 క్షిపణి పొడవు 20 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు. ఈ క్షిపణి బరువు 17 టన్నులు. ఈ క్షిపణికి 1000 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. విజయవంతమైన ఈ క్షిపణి పరీక్ష విశ్వసనీయమైన కనీస నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారతదేశ విధానాన్ని పునరుద్ఘాటిస్తుంది అని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగం అన్ని కార్యాచరణ పారామితులు, క్షిపణి వ్యవస్థ విశ్వసనీయతను ధ్రువీకరించిందని పేర్కొంది.

Train Derailment : పట్టాలు తప్పిన రైలు..21 మంది మృతి,50 మందికి పైగా గాయాలు

Fire Accident : మెట్రో పార్కింగ్ లో భారీ అగ్ని ప్రమాదం...కాలి బూడిదైన వాహనాలు

అగ్ని-IV అగ్ని శ్రేణి క్షిపణులలో నాల్గవది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని అంతకుముందు అగ్ని II ప్రైమ్ అని పిలిచేవారు. ఈ అగ్ని క్షిపణిని చాలాసార్లు పరీక్షించారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ క్షిపణిని పరీక్షించారు. ఇది మొదటిసారి 11 డిసెంబర్ 2010న పరీక్షించబడింది. గతేడాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 1000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. . ఈ క్షిపణిని ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి 27 అక్టోబర్ 2021న ప్రయోగించారు. ఈ అత్యాధునిక క్షిపణులను భారత్‌లో విజయవంతంగా పరీక్షించడం వల్ల ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు నిద్ర పట్టడం లేదంట.

First published:

Tags: DRDO, Missile, Odisha

ఉత్తమ కథలు