హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: జమ్మూ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక వేత్తలకు అమిత్ షా పిలుపు

Amit Shah: జమ్మూ కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామిక వేత్తలకు అమిత్ షా పిలుపు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah: మోదీ ప్రభుత్వం కొత్త విద్యావిధానం, ఆరోగ్య విధానం, డ్రోన్‌ విధానం, ప్రతి రంగంలోనూ కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జమ్మూ కాశ్మీర్‌లో పాలసీ, శాంతిభద్రతలను చూసి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలని మంగళవారం పరిశ్రమల బోర్డు అసోచామ్ వార్షిక సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. లోయలోని అనుకూల పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. 2014కు ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవని.. మోదీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఆర్థిక ప్రపంచ ప్రతినిధులతో అన్నారు. ఇండియా @ 100 పాత్ టు ఇన్‌క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గ్రోత్ పేరుతో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా.. అందరం కలిసి నవ భారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ఇచ్చిన లక్ష్యంలో అందరికీ అవకాశం ఉందని.., కాబట్టి పరిమాణం, స్థాయి గురించి చింతించాల్సిన అవసరం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు.

కశ్మీర్ లోయలో(Kashmir Valley) అనుకూల పరిస్థితుల గురించి హోంమంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఇది స్వర్ణ కాలం అని ఆర్థిక ప్రపంచ ప్రతినిధులతో అన్నారు. కోవిడ్ సమయంలో మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎలాంటి నోటిఫికేష‌న్ లేకుండా ఇలా ఎలా జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న పడ్డారన.. కానీ ఇంత జ‌రిగింద‌ని ఆ స‌మ‌యంలో ఆ నేత పిలుపుతో ప్రజల్లో ఇంట్లోనే ఉండిపోయారని అన్నారు.

ఇంతకు ముందు బడ్జెట్‌లో లోటు దాపురించిందని, గారడీ చేశామని, కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకత తీసుకొచ్చిందని అమిత్ షాఅన్నారు. రాజకీయ సుస్థిరత కల్పించే పని మోదీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా అన్నారు. గత 10 సంవత్సరాల కాలాన్ని రాజకీయ సుస్థిరత కాలం అంటారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రదాడులు అంతం కాబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

ITR Filing: ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోగా ఫైల్‌ చేయాలి? ఐటీఆర్ ఫారమ్స్ ఎన్ని రకాలు..?

Medical Students: ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

మోదీ ప్రభుత్వం కొత్త విద్యావిధానం, ఆరోగ్య విధానం, డ్రోన్‌ విధానం, ప్రతి రంగంలోనూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు నచ్చని నిర్ణయాలను మోదీ ప్రభుత్వం ఎన్నడూ తీసుకోలేదని, ప్రజలకు మేలు జరగాల్సిన నిర్ణయాలను తీసుకుందన్నారు. 2025 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అమి షా చెప్పారు.

First published:

Tags: Amit Shah

ఉత్తమ కథలు