హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కరోనా వ్యాక్సిన్ పై షాకింగ్ న్యూస్.. టీకా తీసుకున్న హ‌ర్యానా మంత్రికి పాజిటివ్

కరోనా వ్యాక్సిన్ పై షాకింగ్ న్యూస్.. టీకా తీసుకున్న హ‌ర్యానా మంత్రికి పాజిటివ్

అనిల్ విజ్(ఫైల్ ఫొటో)

అనిల్ విజ్(ఫైల్ ఫొటో)

హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్(Haryana health minister Anil Vij)కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే.. ఆయన కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకా(Covaxin vaccine)ను వేయించుకోవడం ఆందోళకు కారణమైంది.

ఇంకా చదవండి ...

త్వరలో భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని దేశం మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న వేళ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే.. ఆయన కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకాను వేయించుకోవడం ఆందోళకు కారణమైంది. ఈ విషయాన్ని ఈ రోజు ఉద‌యం మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో వెల్లడించారు. తాజాగా నిర్వహించిన కోవిడ్‌19 ప‌రీక్ష‌లో తనకు పాజిటివ్ గా తేలిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 20న మంత్రి అనిల్‌ కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిట‌ల్‌లో జ‌రిగిన మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో మంత్రి వాలంటీగా మారారు. దీంతో ఆయన వాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

వాక్సిన్ తీసుకున్న 15 రోజులకే ఆయనకు కరోనా సోకడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ సైతం భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ తయారీలో పురోగతిపై సమీక్షించారు. అయితే ఈ విషయంపై భారత్ బయోటెక్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే.. ఇండియాలో కరోనా కొత్త కేసులు కంట్రోల్‌లోకి వచ్చాయి కానీ... మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ప్రపంచ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతున్నట్లే... ఇండియాలోనూ మరణాల జోరు తగ్గకపోవడం గమనించదగ్గ విషయం. ఇండియాలో నిన్న 36,652 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇండియాలో నిన్న 512 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,39,700కి చేరింది. ఇండియాలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.3 శాతంగా ఉంది.

First published:

Tags: Corona, Corona Vaccine, Covid-19, Haryana

ఉత్తమ కథలు