ఇటీవల గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ బీజేపీ కంచుకోట. అలాంటి రాష్ట్రంలో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ తహతహలాడుతుంది. ఈ క్రమంలో గుజరాత్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా గుజరాత్ ప్రజలు విద్య, ఆరోగ్య రంగాలను ప్రైవేటీకరణ చేయడాన్ని అంగీకరించరు. మనమంతా కలిసి మార్పు తీసుకొద్దాం కాంగ్రెస్ కు ఓటేయండి అని ట్వీట్ చేశారు.
Ahmedabad | Congress launches party's election manifesto for #GujaratAssemblyPolls pic.twitter.com/AaXomu7Ruw
— ANI (@ANI) November 12, 20 జన్ ఘోష్ పత్ర పేరిట రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు, విద్య , వైద్యంకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ముఖ్యంగా 8 అంశాలే అజెండాగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వంచన నుంచి మనల్ని కాపాడుకుందాం..రాష్ట్రంలో సరికొత్త మార్పులను తీసుకొద్దాం అన్నారు.Supreme Court: ఉద్యోగుల పెన్షన్ (సవరణ) పథకాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. వేతన పరిమితి రూ.15 వేలు రద్దు..
The people of Gujarat will not allow rampant privatisation of Education and Healthcare. Let's bring the change together. Vote for Congress ✅#कांग्रेस_का_जन_घोषणा_पत्रpic.twitter.com/1on38snEJD
— Congress (@INCIndia) November 12, 2022 మేనిఫెస్టోలోని హామీలు ఇవే..
యువతకు 10 లక్షల ఉద్యోగాలు ..రూ.3000 నిరుద్యోగ భృతి గ్యాస్ సిలిండర్ రూ.500కే అందించటం..300 యూనిట్ల వరకు కరెంటు ఉచితం రైతులకు రూ.3 లక్షల రుణమాఫీ..విద్యుత్ బిల్లుల మాఫీ కరోనాతో మృతి చెందిన కుటుంబానికి రూ.4 లక్షల ఆర్ధిక సహకారం కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం..కొత్త ఆసుపత్రుల నిర్మాణం
మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది.
రెండో దశ ఎన్నికలకు నవంబరు 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబరు 17 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఇచ్చారు. నవంబరు 18న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రాకు నవంబరు 21 వరకు గడువు ఉంటుంది. డిసెంబరు 5న రెండో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.