బంగారంతో మన భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. మన సంస్కృతిలో పసిడి ఒక భాగమైపోయింది. అందుకే ప్రతి మహిళ కూడా బంగారం ఆభరణాలను ధరిస్తుంది. ఐతే ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఎంతో విలువైన బంగారం.. ఉచితంగా దొరికితే ఎవరైనా వదలిపెడతారా? అందిన కాడికీ ఎత్తుకెళ్తారు. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోనిపార్కండి గ్రామంలో ఉన్న ఓ నదిలో బంగారం దొరుకుతోంది. గ్రామస్తులంతా ఎగబడి మరీ తీసుకెళ్తున్నారట. అసలేం జరిగిందంటే..?
పార్కండి గ్రామం మీదుగా బన్స్లోయి నది ప్రవహిస్తుంది. వర్షాకాలంలో ఈ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎండాకాలంలో నీరు ఎక్కువగా ఉండదు. ప్రస్తతుం కూడా నీరు తక్కువగా ఉంది. ఐతే ఈ నదిలోని ఇసుకలో బంగారం దొరుకుతోందన్న వార్త ధావానలంగా వ్యాపించింది. కొందరు వ్యక్తులకు బంగారం దొరికిందన్న ప్రచారం జరగడంతో.. అందరూ నది ఒడ్డుకు వెళ్లి.. ఇసుకను తవ్వుతున్నారు. అలా తవ్విన వారిలో కూడా కొందరికి బంగారం దొరికిందట. ఝార్ఖండ్కు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం నది ఒడ్డు నుండి బంగారు దొరికాయట. బన్స్లోయి నది ఒడ్డున బంగారం మొదట ఈయనకే దొరికిందట. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలియడంతో.. గ్రామస్తులంతా నది వద్దకు చేరుకొని.. బంగారం కోసం వెతుకుతున్నారు. బంగారు నాణేలు వంటి పలు గుండ్రటి వస్తువులు లభించినట్లు స్థానిక వర్గాల ద్వారా తెలిసింది.
Subarnarekha: మన దేశంలోని ఈ నదిలో బంగారం ప్రవహిస్తుందని మీకు తెలుసా?
రెండు రోజుల క్రితం ఇక్కడి నదిలో ఇసుకలో బంగారం దొరికిందని స్థానిక యువకుడు సుజన్ షేక్ తెలిపారు. అందుకే తాను కూడా ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. తనకైతే దొరకలేదని.. కానీ చాలా మందికి చిన్న చిన్న బంగారం నాణేలు దొరికాయని పేర్కొన్నారు. ఐతే ఈ బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బ్రిటిష్ కాలంలో సంపన్న పట్టణంగా పేరున్న 'మహేష్పూర్ రాజ్బరి' చాలా వరకు సుబర్ణరేఖ నది నీటిలో మునిగిపోయిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అక్కడి నుంచి సుబర్ణరేఖ నది ద్వారా బాన్స్లోయి నదికి వచ్చి చేరి ఉంటుందని పేర్కొన్నారు.
బంగారం కోసం పార్కండి గ్రామానికి వచ్చే వారి సంఖ్య పెరగడంతో... పాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. రివర్ క్రాసింగ్ కాపలాగా ఉన్నారు. నది వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఈ విషయంపై భారత పురావస్తు శాఖకు సమాచారం అందించామని రాంపూర్హట్ సబ్ డివిజనల్ కమిషనర్ తెలిపారు. వారి బృందం వచ్చి ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. కాగా, సుబర్ణరేఖ నదికి ఇప్పటికే గోల్డ్ రివర్గా పేరున్న విషయం తెలిసిందే. అక్కడి నదిలో బంగారం ప్రవహిస్తోందని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే బన్స్లోయి నదిలో బంగారం దొరకడం ఆసక్తి రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, West Bengal