news18-telugu
Updated: January 25, 2019, 5:35 PM IST
ఇందులో భాగంగా నిత్యం ఢిల్లీ నుంచి నెవార్క్కు, వారంలో మూడు రోజులు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు విమానాలు వెళ్లనున్నాయి. అదే విధంగా ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఢిల్లీ, బెంగళూరు, ముంబాయిల నుంచి పారిస్లకు జూలై 18 నుంచి ఆగస్ట్ 1 వరకు 28 విమానాలను తిప్పనుంది. ఇక భారత్ నుంచి ఎయిర్ ఇండియా అమెరికా, ఫ్రాన్స్లకు సర్వీసులను అందించనుంది.
పండగలతో పాటు కొన్ని ప్రత్యేక రోజుల్లో విమాన సంస్థలు స్పెషల్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. తోటి విమాన సంస్థల నుంచి పోటీని తట్టుకోవడంతో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు చౌక ధరకే టికెట్లను అందిస్తుంటాయి. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల వేళ అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది గో ఎయిర్ విమాన సంస్థ. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు వెళ్లే వారికి తక్కువ ధరకే టికెట్లు అందిస్తోంది. రూ.999 నుంచి టికెట్ల ధరలు మొదలవుతాయి.
హైదరాబాద్, కోల్కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో గో ఎయిర్ టికెట్లు తక్కువ ధరకే లభించనున్నాయి. ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లలో కనిష్టంగా రూ.999కే విమాన ప్రయాణం చేయవచ్చు. బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణించవచ్చు. ఇక ముంబై-లేహ రూట్లో ప్రయాణించాలంటే రూ.4,599 చెల్లించాలి.
ఐతే, ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య విమాన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొనే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు జనవరి 26 లేదా అంతకంటే ముందే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
టికెట్ల వివరాలు ఇక్కడ చూడండి:

Published by:
Shiva Kumar Addula
First published:
January 25, 2019, 5:31 PM IST