ఢిల్లీ సరిహద్దుల్లోని సోనిపట్లో రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న బాబా రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని ఓ గురుద్వారాలో మత ప్రబోధకుడిగా ఉన్న ఆయన గన్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. 65 సంవత్సరాల బాబా రామ్ సింగ్ తన ఆత్మహత్యకు కారణాలు సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కుండ్లీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సింఘు బోర్డర్కు ఇది సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైతుల ఉద్యమానికి ఈ సింఘు బోర్డర్ కేంద్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికి 21 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. బాబా రామ్ సింగ్ తాను రాసిన సూసైడ్ లెటర్లో కేంద్రం తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని, బాధను తెలియజేసేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘రైతుల్లో బాధను చూస్తున్నా. వారి హక్కుల కోసం రైతులు పోరాడుతున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయడం లేదు. వారి బాధను నేను పంచుకుంటున్నా. అన్యాయం చేయడం పాపం. అన్యాయాన్ని ఉపేక్షించడం కూడా పాపం. రైతులకు మద్దతు పలికేందుకు కొందరు అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. నేను నన్ను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా.’ అని ఆ సూసైడ్ లేఖలో బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు.
బాబా రామ్ సింగ్ గన్తో కాల్చుకున్న విషయం తెలిసిన వెంటనే ఆయన్ను పానిపట్లోని పార్క్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని కర్నాల్కు తరలించారు.
We got information that Sant Ram Singh of Karnal committed suicide by shooting himself. He was taken to Panipat hospital, where he died. Then, he was taken to Karnal Civil Hospital, where Sonipat Police is also there for further probe: Virendra Singh, DSP (Head Quarter), Sonipat pic.twitter.com/Fgg6aXvHqN
— ANI (@ANI) December 16, 2020
‘ కర్నాల్కు చెందిన సంత్ బాబా రామ్ సింగ్ రైతుల ఉద్యమం సందర్భంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చాలా మంది రైతులు త్యాగాలు చేశారు. మోదీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. వారితో క్రూరంగా వ్యవహరిస్తోంది. మొండితనం వీడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయండి.’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రామ్ సింగ్ మరణం తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మరణం వృధా పోవొద్దని అకాలీదళ్ నేత సుఖ్బీర్ బాదల్ ట్వీట్ చేశారు. వెంటనే కేంద్రం మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Anguished to hear that Sant Baba Ram Singh ji Nanaksar Singhra wale shot himself at Singhu border in Kisan Dharna, looking at farmers' suffering. Sant ji's sacrifice won't be allowed to go in vain. I urge GOI not to let situation deteriorate any further & repeal the 3 agri laws. pic.twitter.com/2ct4prkcoJ
— Sukhbir Singh Badal (@officeofssbadal) December 16, 2020
మరోవైపు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రైతు సంఘాలతో ఓపెన్ మైండ్తో చర్చలు జరపాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రతిష్టంభనను తొలగించడానికి రైతలు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్యానెల్ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రైతుల చేస్తున్న ఆందోళన దేశ ప్రయోజనాలకు సంబంధించినదని..సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.