ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగు చట్టాల రద్దు గురించే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంపై ఇటు రాజకీయ పక్షాలు.. అటు రైతులు.. చర్చించుకుంటున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఐతే రైతులపై ఉన్న ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని.. అన్నదాతల సుదీర్ఘ పోరాటం వల్లే సాధ్యమయిందని కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది రైతులు సాధించిన విజయమని కొనియాడుతున్నారు. అన్నదాతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసిస్తున్నారు. ఏడాది కాలంగా కుటుంబాన్ని.. పొలాన్ని వదిలేసి.. ఉద్యమం చేయడం వల్లే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. మరి సాగు చట్టాల రద్దుపై ఎవరు ఏమన్నారో ఇక్కడ చూద్దాం.
''సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. పార్లమెంట్లో చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. అప్పటి వరకు వేచి చూస్తాం. ఒకవేళ అప్పుడు నిజంగా చట్ట సభల వేదికగా సాగు చట్టాలను రద్దు చేస్తే, ఏడాది కాలంగా రైతులు చేస్తున్న పోరాటానికి అది చారిత్రక విజయం అవుతుంది.''
-సంయుక్త్ కిసాన్ మోర్చా
''మా ఆందోళనలను ఇప్పుడే విరమించం. పార్లమెంట్లో సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఎదుచూస్తాం. మద్దతు ధరతో పాటు రైతుల సమస్యలపైనా చర్చ జరగాలి.''
-రాకేశ్ తికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత
आंदोलन तत्काल वापस नहीं होगा, हम उस दिन का इंतजार करेंगे जब कृषि कानूनों को संसद में रद्द किया जाएगा ।
सरकार MSP के साथ-साथ किसानों के दूसरे मुद्दों पर भी बातचीत करें : @RakeshTikaitBKU#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021
''దేశ రైతుల తమ సత్యాగ్రహంతో అహంకారం తలను దించుకునేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించినందుకు అభినందనలు.''
-రాహుల్ గాంధీ
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
''అధికారంలో ఉన్న వారి బలం కట్టే ప్రజా బలమే గొప్పది. ఇది మరోసారి నిరూపితమయింది. రైతులు అలుపెరగని పోరాటంతో తమ డిమాండ్లను సాధించుకున్నారు. జై జవాన్. జై కిసాన్.''
“The power of people is always greater than the people in power”
Proved once again by the Indian farmers who got what they demanded by their relentless agitation ?
Jai Kisan Jai Jawan#FarmLawsRepealed#TRSwithFarmers#FarmersProtest
— KTR (@KTRTRS) November 19, 2021
''బీజేపీ క్రూర చర్యలకు వెనక్కి తగ్గకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి రైతుకీ నా అభినందనలు. ఇది మీ విజయం. ఈ పోరాటంలో ప్రాణఆలు కోల్పోయిన రైతు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.''
- మమతా బెనర్జీ
My heartfelt congratulations to every single farmer who fought relentlessly and were not fazed by the cruelty with which @BJP4India treated you. This is YOUR VICTORY!
My deepest condolences to everyone who lost their loved ones in this fight.#FarmLaws
— Mamata Banerjee (@MamataOfficial) November 19, 2021
''ఇది రైతుల విజయం. రోజుల తరబడి వారు ఆందోళన చేేస్తున్నారు. ఇప్పటి వరకు 700 మంది మరణించారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలి. కేంద్రం పెద్ద తప్పు చేసింది. ఈ విషయమై పార్లమెంట్లో మాట్లాడతాం.''
-మల్లిఖార్జున ఖర్గే
It's farmers' victory, who have been protesting against farm laws for so many days; over 700 died. Seems like Centre is guilty... But who'll take responsiblity for the hardships that farmers had to go through? We will raise these issues in Parliament: Congress' Mallikarjun Kharge pic.twitter.com/XKBm8uShk8
— ANI (@ANI) November 19, 2021
కేంద్రం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలకు చెందిన అన్నదాతలు పండగ చేసుకుంటున్నారు. ఇది రైతుల విజయమని వేడుకలు చేసుకుంటున్నారు. ఐనప్పటికీ తమ ఆందోళనలను ఉపసంహరించుకోబోమని.. పార్లమెంట్లో చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farm Laws, Farmer, New Agriculture Acts, PM Narendra Modi