హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Facebook: ఫేస్‌బుక్‌లో ఆర్మీ చీఫ్ మ‌ర‌ణంపై అనుచిత పోస్టు చేసిన ఇద్ద‌రిపై కేసు న‌మోదు

Facebook: ఫేస్‌బుక్‌లో ఆర్మీ చీఫ్ మ‌ర‌ణంపై అనుచిత పోస్టు చేసిన ఇద్ద‌రిపై కేసు న‌మోదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff ) జనరల్ బిపిన్ రావత్ మరణంపై కించపరిచే సందేశాలను పోస్ట్ చేసినందుకు ఇద్ద‌రు ఫేస్‌బుక్ ఖాతాల వినియోగదారులపై కర్ణాటక పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. మంగళూరులో ఈ కేసులు నమోదయ్యాయి.

ఇంకా చదవండి ...

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff ) జనరల్ బిపిన్ రావత్ మరణంపై కించపరిచే సందేశాలను పోస్ట్ చేసినందుకు ఇద్ద‌రు ఫేస్‌బుక్ ఖాతాల వినియోగదారులపై కర్ణాటక పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.   మంగళూరులో ఈ కేసులు నమోదయ్యాయి. ఫేస్‌బుక్ (Facebook) ఖాతాలపై ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్ల‌డించారు. భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 505(1) (ఏదైనా ప్రకటన, పుకారు లేదా నివేదికను ఎవరు చేసినా, ప్రచురించినా లేదా ప్రసారం చేసినా), 505 (2) (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటనలు) మరియు 505 (1) (a) కింద కేసు నమోదు చేయబడింది. (ఏదైనా అధికారి, సైనికుడు తిరుగుబాటు చేయడం లేదా విస్మరించడం లేదా అతని విధి నిర్వహణలో వైఫల్యం చెందడం వంటి ఉద్దేశ్యంతో లేదా కారణం కావచ్చు). కేసులున‌మోదు చేశారు.

యాదృచ్ఛికంగా, కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రావత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు రాసిన వారిపై లేదా అతనిని అపహాస్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించిన ఒక రోజు తర్వాత కేసులు నమోదు చేశారు.

Saryu National Project: 1978లో ప్రారంభ‌మైన ప‌నులు.. ఇప్పుడు పూర్త‌య్యాయి.. ఏమిటీ ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త‌


మిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్రువీకరించింది. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin Rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు మ‌ర‌ణించారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.

ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌ (Helicopter)లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. అయితే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.

AIIMS Jobs : ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.. వేత‌నం రూ.. 1,42,506.. అప్లికేష‌న్ ప్రాసెస్ ఇదే!


హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తునమంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తు పట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

First published:

Tags: Army Chief General Bipin Rawa, Bipin Rawat, CYBER CRIME, Social Media

ఉత్తమ కథలు