హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019: భారత్ వెనుకబడ్డ 4 అంశాలివే

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019: భారత్ వెనుకబడ్డ 4 అంశాలివే

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగు అంశాల్లో మాత్రం వెనుకబడింది. వచ్చే ఏడాది 50వ ర్యాంకుకు ఎగబాకాలన్న మోదీ సర్కారు లక్ష్యం నెరవేరాలంటే ఈ అంశాల్లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకోవాల్సి ఉంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగు అంశాల్లో మాత్రం వెనుకబడింది. వచ్చే ఏడాది 50వ ర్యాంకుకు ఎగబాకాలన్న మోదీ సర్కారు లక్ష్యం నెరవేరాలంటే ఈ అంశాల్లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకోవాల్సి ఉంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగు అంశాల్లో మాత్రం వెనుకబడింది. వచ్చే ఏడాది 50వ ర్యాంకుకు ఎగబాకాలన్న మోదీ సర్కారు లక్ష్యం నెరవేరాలంటే ఈ అంశాల్లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకోవాల్సి ఉంది.

    సరళతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకుల్లో భారత్ 23 స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకులో నిలిచింది. దక్షిణాసియా దేశాల్లో భారత్ నెంబర్.1 స్థానంలో నిలిచింది. 190 దేశాల్లో పరిస్థితులను 10 అంశాలను ప్రామాణికాలుగా పరిగణలోకి తీసుకుని ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. వాణిజ్య అనుకూల విధానాలు, నిర్మాణ అనుమతులు, రుణం పొందడంలో సరళత, చిన్న సంఖ్యలోని పెట్టబడిదారులకు రక్షణ తదితర అంశాలను ప్రామాణికలుగా ఈ నివేదికను ప్రకటించారు.

    మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014లో మొత్తం 190 దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉంది. 2016లో 131కి ఎగబాకిన భారత్...2017లో 100కి, ఈ ఏడాది 77కి చేరింది. 2014 నుంచి 65 స్థానాలు...గత రెండేళ్లలోనే 53 స్థానాలు మెరుగుపరుచుకుంది భారత్. జీఎస్టీ బిల్లు, పెద్ద నోట్ల రద్దు, దివాలా స్వాధీన ట్రైబ్యునళ్ల ఏర్పాటు, భారీ రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు వంటి సంస్కరణలతో భారత్‌లో వాణిజ్యం సరళతరం అవుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.

    ప్రతీకాత్మక చిత్రం(Photo:Getty)

    పది అంశాలను ప్రమాణాలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించిన ప్రపంచ బ్యాంకు, పదింటిలో ఆరు అంశాల్లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి  భారత్ ర్యాంకును మెరుగుపరుచుకున్న ఆరు అంశాలు ఇవే.

    1. నిర్మాణ అనుమతులు

    2.సరిహద్దు వాణిజ్యం

    3.వ్యాపార ప్రారంభం

    4.విద్యుత్ కనెక్షన్

    5.పన్నుల చెల్లింపు

    6. సరిహద్దు వాణిజ్యం

    ప్రతీకాత్మక చిత్రం

    అయితే నాలుగు అంశాల్లో భారత్ మెరుగుపడాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక నొక్కి చెప్పింది. ఆ నాలుగు అంశాలు ఇవే.

    1.ఆస్తుల రిజిస్ట్రేషన్

    2.చిన్న సంఖ్యలోని పెట్టుబడిదారులకు రక్షణ

    3.ఒప్పందాల అమలు

    4.దివాలా పరిష్కారం

    పది అంశాల్లో భారత్ విడివిడిగా సాధించిన ర్యాంకులు

    ఆస్తుల రిజిస్ట్రేషన్ అంశంలో భారత్ 166వ ర్యాంకులో నిలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ అంశంలో భారత్ 0.46 శాతం మాత్రమే పెరుగుపడింది. వచ్చే ఏడాది 50వ ర్యాంకు సాధిస్తామని చెబుతున్న మోదీ సర్కారు, అనుకున్న లక్ష్యానికి చేరువకావాలంటే ఈ అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉంది.

    ఇవి కూడా చదవండి..

    First published:

    ఉత్తమ కథలు