మోదీ (Modi) ప్రభుత్వం మరో నిర్ణయానికి ముందడుగు వేస్తోంది. భారతదేశంలో ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, యునైటెడ్ స్టేట్స్తో సహా కనీసం 10 దేశాల ఔషధాల ధరల విధానాలపై అధ్యయనాన్ని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (Department of Pharmaceuticals), కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున అధ్యయనం చేయడానికి ప్రఖ్యాత కంపెనీని వెతకడానికి టెండర్ను రూపొందించినట్టు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో కనీసం 10 దేశాలకు సంబంధించిన ఔషధ ధరల పద్ధతిని అర్థం చేసుకోవడం ఈ మొదటి లక్ష్యం. ఆయా దేశాల్లో ఔషధాల లభ్యత.. స్టోరేజ్ సామర్థ్యం.. వంటి అంశాలు సేకరిస్తారు. నిత్యం ఔషధాల అందుబాటుకు ఆయా దేశాలు అనుసరిస్తున్న మెరుగైన విధానాలను అధ్యయనం చేస్తారు.
PM Narendra Modi: మోదీ మదిలో ఉంది ఇదేనా.. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రకటిస్తారా!
ఈ అధ్యయనం డ్రగ్ ప్రైసింగ్ వాచ్డాగ్ నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రముఖ సంస్థలను భాగస్వాములను చేసుకుంటారు. ఇందుకోసం ప్రతిపాదనను సమర్పించడానికి గడువు ఫిబ్రవరి 21, 2022 వరకు అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే షార్ట్లిస్ట్ (Short List) చేయబడిన బిడ్డర్లను మార్చి 1, 2022 న ప్రకటిస్తారు.
దేశాలు ఇవే..
శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, EU, UK, ఆస్ట్రేలియా, USA, బ్రెజిల్, దక్షిణాఫ్రికా మరియు థాయ్లాండ్ కవర్ చేయవలసిన కనీస పది దేశాలు/ప్రాంతాలల్లో అధ్యయనం నిర్వహిస్తారు.
PM Modi: ఆలయ సిబ్బందికి 100 జతల జ్యూట్ పాదరక్షలు పంపిన ప్రధాని మోదీ
అధ్యయనం ఎలా ఉంటుంది..
అధ్యయనం ప్రాథమికంగా పబ్లిక్ డొమైన్లో లభించే డేటా, ఇతర సమాచారం యొక్క ద్వితీయ మూలాల ఆధారంగా ఉంటుంది. ఇది విదేశీ మిషన్లు, సంబంధిత వాణిజ్యం, పరిశ్రమ సంఘాలు, ఔషధ ఎగుమతిదారులు, విదేశీ తయారీదారులతో వారి అభిప్రాయాన్ని లేదా అభిప్రాయాలను పొందేందుకు ఇంటర్వ్యూలు లేదా ఫోకస్ గ్రూప్ చర్చలు (FGDలు) ఉంటాయి.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా?.. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తారా.. ఢిల్లీ మీడియా సర్కిల్లో ఇప్పుడు ఈ అంశం చక్కర్లు కొడుతుంది. ప్రధాన మంత్రినరేంద్ర మోదీ (PM Narendra Modi) తన రాబోయే గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యీక అంశాన్ని ప్రస్తావించనున్నారని సమాచారం. అదే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (Ayushman Bharat Digital Mission) దేశ ప్రజలకు ఆరోగ్య ఖాతాలను రూపొందించడమే లక్ష్యంగా మోదీ తాజా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medicine, Modi, Narendra modi, PM Narendra Modi