డిల్లీలోని డీఆర్డీవో కేంద్ర కార్యాలయంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్లు
కాసేపటి క్రితం 2DG విడుదల చేశారు.. నోటి ద్వార తీసుకునే ఈ పౌడర్ కరోనా రోగులకు ఆక్సిజన్ పెట్టడాన్ని తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుందని క్లినికల్ ట్రయల్స్ తేలిందని రక్షణశాఖ ఇదివరకు ప్రకటించింది.
ప్రస్తుతం విడుదల చేసిన 2డీజీ ని తయారి కృషి చేసిన డీఆర్డీఓ తోపాటు డా.రెడ్డీస్ ల్యాబ్స్ను మంత్రి హర్షవర్థన్ అభిందించారు. దీంతో ప్రజలు కరోనా భారి నుండి త్వరగా కోలుకుంటారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అధికారులతో పాటు రెడ్డీస్ ల్యాబ్ సీఎండీ సతీష్ రెడ్డిలు పాల్గోన్నారు.
డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ సహకారంతో ఈ మందు హైదరాబాదులో ఎక్కువ మోతాదులో తయారవుతోంది. ఈ 2DG మందు 'మోసగాన్ని మోసం చేయటం' అనే సూత్రంతో పని చేస్తుంది. ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటినుంచి మోసం చేసి ప్రోటీన్ వాడుకుని పదింతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వుంటుంది. గ్లూకోజ్ అణువుల నుండే వైరస్కు శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ పదింతలవుతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. పెరిగే వైరస్ ఎక్కవై తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.
అయితే ఈ 2 డీజీ మందు, వైరస్ ను మోసం చేసి గ్లూకోస్ అని భావించేలా చేస్తుందని. ఈ మందు అణువులను మింగిన వైరస్ లు గుడ్డివై ఇంకా కొత్త వైరస్ లను పుట్టించలేక పోతాయి. ఈ సమయంలో తెల్లకణాలు మిగిలిన వైరస్ లను నాశనం చేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం కొన్ని.గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది. ఈ మందు కనుక అనుకున్నవిధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబుకంటే చిన్న జబ్బుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో 2డీజి అధ్బుతంగా పని చేసినట్టు వెల్లడించారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Dr Reddy's, DRDO, Rajnath Singh