PM Degree: ప్రముఖ వ్యక్తుల గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. కానీ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం, ఈ ఆసక్తి వెనుక వేరే కోణం ఉంటుంది. అయితే ఇలాంటి ఉద్దేశంతో ఆర్టీఐ(RTI) కింద ప్రధాని చదువుకు సంబంధించిన విషయాలు అగడడం సరికాదని గుజరాత్ కోర్టు(Gujarat court) నొక్కి చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏం చదివారో చెప్పాలని, ఆయన డిగ్రీ వివరాలను వెల్లడించాలని గుజరాత్ యూనివర్సిటీని(Gujarat University) ఆదేశిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు(Gujarat Highcourt) ఈరోజు పక్కన పెట్టింది. ప్రధాని డిగ్రీ క్వాలిఫికేషన్స్ వివరాలు అవసరం లేదని పేర్కొంది.
అంతేకాదు, ఈ వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి(Delhi CM Kejriwal) గుజరాత్ హైకోర్టు రూ.25,000 జరిమానా విధించింది. కేజ్రీవాల్ నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఈ పెనాల్టీ డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
* అసలు విషయం ఏంటంటే..
ప్రధాని మోదీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్పై గతంలో కేజ్రీవాల్ నుంచి సమాచార హక్కు కింద ఒక అభ్యర్థన వచ్చింది. దీనిపై 2016లో స్పందించిన కేంద్ర సమాచార కమిషన్, ప్రధాని మోదీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై తాజాగా తీర్పు వెలువడింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారని, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారని ఆయన ఎలక్షన్స్ డాక్యుమెంట్స్లో పేర్కొన్నారు.
గుజరాత్ హైకోర్టు ఆర్డర్, జరిమానాపై కేజ్రీవాల్ స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘ప్రధానమంత్రి ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశానికి లేదా? ఆయన డిగ్రీని బహిర్గతం చేయడాన్ని కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించారు, ఎందుకు? డిగ్రీ వివరాలు అడిగిన వ్యక్తికి జరిమానా విధిస్తారా? ఏం జరుగుతోంది? చదువుకోని లేదా పెద్దగా చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం.’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
News18 కృషిని అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
* ‘ప్రజా ప్రయోజనం లేదు’
గత నెలలో ఈ కేసుపై విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయమని యూనివర్సిటీని బలవంతం చేయరాదని కోరారు. ప్రజాస్వామ్యంలో, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అలాగే ఈ విషయంలో ఎటువంటి ప్రజా ప్రయోజనం లేదు. ప్రధాని గోప్యత కూడా ప్రభావితమవుతుంది. ఒకరి పిల్ల చేష్టలు, బాధ్యతారహితమైన ఉత్సుకతను తీర్చడానికి సమాచారాన్ని అందించమని అడగలేరు’ అని తుషార్ మెహతా వాదించారు. ప్రధాని డిగ్రీలకు సంబంధించిన సమాచారం, ఆయన పాత్రపై ఎలాంటి ప్రభావం చూపదని నొక్కి చెప్పారు.
ఆర్టీఐ కింద అభ్యర్థించే సమాచారం పబ్లిక్ యాక్టివిటీకి సంబంధించినదిగా ఉండాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘నేను బ్రేక్ఫాస్ట్తో ఏం తిన్నాననే వివరాలను వారు అడగలేరు. కానీ అల్పాహారం కోసం ఎంత మొత్తం ఖర్చు చేశానో వారు అడగవచ్చు’ అని తుషార్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల నామినేషన్ ఫారమ్లలో ప్రధాని విద్యార్హతలు పేర్కొన్నారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది పెర్సీ కవీన వాదించారు. డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నామని, ప్రధాని మార్కుషీట్ కాదని పేర్కొన్నారు. కానీ కోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానమంత్రి విద్యార్హతలను హైలైట్ చేస్తూ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేస్తున్న దూకుడుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, గుజరాత్ హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Fine, Gujarath, Pm modi