కరోనా (Corona) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా బడులు మూత పడ్డాయి. చాలా చోట్ల ఆన్లైన్ క్లాస్లే సాగుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంటికే పరిమితం అవ్వడంతో చదువులు బాగా దెబ్బతిన్నాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. తాజాగా ఓ విద్యార్థి రాసిన థియరీ సోషల్ మీడియా (Social Media) లో తెగ చక్కర్లు కొడుతుంది. ద్యార్థి సర్ ఐజాక్ న్యూటన్ (Newton) కి సంబంధించిన నాల్గవ నియమం ప్రకారం కరోనా, పరిశోధనలు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే కరోనా పెరుగుతుంటే, పరిశోధనల క్రమం నెమ్మదిస్తోంది. అదే పరిశోధనలు వేగవంతం అవుతుంటే కరోనో తగ్గుముఖం పడుతోంది. అంతేకాదు దీన్ని ఒక సమీకరణాన్ని రూపంలో చూపించి మరీ వివరించి చెప్పాడు. పైగా 'కే' అనే ఒక స్టిరమైన వేరియబుల్ "వినాశనం"ను సూచిస్తుందని రాసుకొచ్చాడు.
Covid 19 Rules: రూల్స్ పాటించారా సరే.. లేదా లాక్డౌన్ తప్పదంటున్న సీఎం
‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖ బీజేపీ నాయకుడికి కరోనా పాజిటివ్
हॉल के केंद्र में बैठे व्यक्ति के छींकने से उसके 156 डिग्री कोण पर 200 मीटर दूर बैठा शख्स कोरोना संक्रमित हो जाता है, हॉल का क्षेत्रफल बताइये। अगर हॉल वृताकार है तो त्रिज्या भी निकालिये।
— anand sharma (@rig_andy) January 4, 2022
దీనిమీద పలువురు జోక్లు వేస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. ఈ థియరీని సీబీఎస్ఈ సెలబస్లో చేర్చాలని సెటైర్లు వేస్తున్నారు. అయితే.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కోవిడ్తో అల్లాడిపోతున్నాయి. ఒకనొక దశలో వ్యాక్సిన్లు లేక వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడేమో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఆ వైరస్ తన తీరుని మార్చకుంటోంది. పైగా ఒక్కొక్కరిలో ఒక్కోలా మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇంత సీరియస్ విషయాన్ని సున్నితంగా చెప్పిన విద్యార్థి సృజనాత్మకతను మెచ్చుకొంటు పలువురు మెచ్చుకోవడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral image, Viral in internet, Viral tweet