దేశంలో కరోనా కేసులు (Corona Cases) రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా ఎక్కడ చూసినా కరోనా తీవ్రత పెరిగింది. చాలా రాష్ట్రాలు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. దేశంలో రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సలహా ఇచ్చారు ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఇటీవల జరిగిన ఓ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ట్వీట్ చేస్తూ ఈ సలహా ఇచ్చారు. కరోనా విషయంలో ఎంతో అప్రమత్తత అవసరం అని.. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు.
CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేషన్లో మార్పులు.. ఇకపై మరింత వెసులుబాటు
A chilling, cautionary tale. I was getting confused with all the recent messaging about natural immunity being the superior option but this is like a bucket of cold water. Death isn’t a risk worth challenging vaccinations for.. https://t.co/RsaClxxmrS
— anand mahindra (@anandmahindra) January 21, 2022
ఏం జరిగింది..
ఇటీవల చెక్ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా మరణించారు. ఆమె మరణించే వరకు ఆమె వ్యాక్సినేషన్ (Vaccination) వద్దు అనే ప్రచారం చేశారు. కరోనాకు విరుడుగా వ్యాక్సినేషన్ వద్దని శరీరంలో సహాజ సిద్ధంగా వృద్ధి చెందే రోగ నిరోధకత శక్తియే మేలు అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేశారు. ఆమె భర్త, కొడుకు వ్యాక్సిన్ తీసుకున్నా హనా హోర్కా మాత్రం టీకాకు దూరంగా ఉన్నారు. అంతే కాకుండా శరీరంలో ఉండే సహాజ రోగ నిరోధక శక్తి ప్రభావం అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో హనా హోర్కా ఏరికోరి కరోనా తెచ్చుకున్నారు.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
చనిపోవడానికి రెండు రోజుల ముందు సోషల్ మీడియా (Social Media) లో తన ఫాలోవర్స్తో ఆమె మాట్లాడింది. తనకు కరోనా వచ్చిందని, టీకా తీసుకోకపోయినా తాను దాన్ని జయించబోతున్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనవడం వల్లే తన తల్లి టీకా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయిందటూ ఆమె కొడుకు రెక్ తెలిపాడు. ఈ ఉదంతం చాలా దారుణమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రమాదకర చాలెంజ్లు వద్దని హితవు..
హనాహోర్కా ఉదంతాన్ని ఆనంద్ మ ప్రస్తావిస్తూ ప్రమాదకర ఛాలెంజ్ల జోలికి వెళ్లొద్దంటూ సూచించారు. ప్రాణాలతో చెలగాటం సరికాదని అందరిక సూచించారు.
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 19.6లక్షల టెస్టులు నిర్వహించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు (టీపీఆర్) 17.22 శాతంగా ఉంది. తెలంగాణ కరోనా కేసులు, తెలంగాణ తాజా కరోనా కేసులు, కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3లక్షల 37వేల 704 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.89కోట్లు దాటేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.