సరిహద్దుల్లో చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు వాటిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు తూర్పు లద్దాక్ లో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద భారత్, చైనా బలగాలే వెనక్కి వెళ్లినట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా.. దీనిపై భారత్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. గతేడాది మే లో గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి.
Chinese and Indian border troops on the southern and northern shores of Pangong Lake began disengagement as planned on Wednesday according to the consensus reached during the ninth round of military commander-level talks, reports Chinese media quoting Chinese Defence Ministry pic.twitter.com/J9d0iOQFWg
— ANI (@ANI) February 10, 2021
ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారు. తొమ్మిదో రౌండ్ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం మేరకు చైనా, భారత్ సాయుధ దళాలు వెనక్కి వెళ్లాయని చైనా రక్షణ శాఖ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Defence Ministry, India, India-China, Indo China Tension