హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Padma Awards: చినజీయర్‌కు పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. ఏపీ, తెలంగాణ నుంచి ఇంకెవరెవరు ఉన్నారంటే..

Padma Awards: చినజీయర్‌కు పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ.. ఏపీ, తెలంగాణ నుంచి ఇంకెవరెవరు ఉన్నారంటే..

చిన జీయర్ స్వామి, కీరవాణి (ఫైల్ ఫోటో)

చిన జీయర్ స్వామి, కీరవాణి (ఫైల్ ఫోటో)

Padma Awards: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామికి పద్మభూషణ్ పురస్కారం లభించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బుధవారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగువారికి ప్రాధాన్యత లభించింది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామికి(China Jeeyar Swamy) పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన కమలేశ్ పటేల్‌కు కూడా పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారం దక్కింది. ఇక పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న ప్రముఖల్లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ, ఏపీ నుంచి మరికొందరికి పద్మ పురస్కారాలు లభించాయి. తెలంగాణ నుంచి మడడుగు విజయ్ గుప్తా, పసుపులేటి హనుమంతరావు, బి. రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డులు రాగా.. ఏపీ నుంచి గణేశ్ నాగప్ప కృష్ణరాజన్నగార, సీవీ రాజు, అబ్బరెడ్డి నాగేశ్వరరావు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాశ్ చంద్ర సూద్‌లకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.

మొత్తంగా ఈ ఏడాది 106 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించగా.. ఇందులో 6 మందికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్) యొక్క పితామహుడు దిలీప్ మహలనాబిస్‌కు మరణానంతరం భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 87 ఏళ్ల డాక్టర్ మహలనాబిస్ ఓఆర్‌ఎస్‌ను విస్తృతంగా ఉపయోగించడంలో ముందున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్లకు పైగా ప్రాణాలను కాపాడిందని అంచనా. గత అక్టోబర్‌లో కోల్‌కతాలో మహలనాబిస్ మరణించారు.

అదే సమయంలో తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, శ్రీనివాస వర్ధన్‌లకు పద్మవిభూషణ్ లభించింది. ఇది కాకుండా దిలీప్ మహల్నబీస్‌తో పాటు ములాయం సింగ్ యాదవ్, బాలకృష్ణ దోషికి మరణానంతరం పద్మవిభూషణ్‌ పురస్కారం లభించింది. ఎస్‌ఎల్ భైరప్ప, కుమార్ మంగళం బిర్లా, దీపక్ ధర్, వాణీ జయరామ్, స్వామి చిన్న జీయర్, సుమన్ కళ్యాణ్‌పూర్, కపిల్ కపూర్, సుధా మూర్తి, కమలేష్ డి పటేల్‌లను పద్మభూషణ్‌తో సత్కరించనున్నారు.

Congress: సీనియర్ నేతలకు కాంగ్రెస్ నాయకత్వం వార్నింగ్.. ఇకపై అలా జరగవద్దంటూ..

India Map: ఈ లొకేషన్ అచ్చం ఇండియా మ్యాప్‌లా ఉంది కదా? హైదరాబాద్ నుంచి ఎంత దూరమంటే..

డా. సుకమా ఆచార్య, జోధయ్యబాయి బైగా, ప్రేమ్‌జిత్ బైరియా, ఉషా బార్లే, మునీశ్వర్ చంద్ దావర్, హేమంత్ చౌహాన్, భానుభాయ్ చితారా, హేమోపోవా చుటియా, నరేంద్ర చంద్ర దెబ్బర్మ (మరణానంతరం), సుభద్రాదేవి, ఖాదర్ వల్లీ దూదేకుల, హేమ్ చంద్ర గోస్వామి, ప్రివత్ గోస్వామి, గుప్తాకు పద్మశ్రీ అవార్డు లభించింది.

దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ ఉన్నాయి. 1954 నుండి, ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళ, సాహిత్యం మరియు విద్య , క్రీడలు, వైద్యం మరియు సామాజిక సేవా రంగాలలో ఎందరో కీర్తించని వీరులకు ఈ గౌరవాలు ఇవ్వబడ్డాయి.

First published:

Tags: Andhra Pradesh, Padma Awards, Telangana

ఉత్తమ కథలు