డిసెంబర్ 11, 2021న జరిగిన సీబీఎస్ఈ (CBSE) పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నా పత్రంలో ‘మహిళలను తక్కు వ చేసి చూడడం , భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చే వాక్యా లు ఓ పేరా రూపొందించారని ఇది పూర్తిగా అభ్యంతరకరమని ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు ఆ కాంప్రెహెన్షన్ పేరాను తొలగిస్తున్నట్టు ప్రకటిచింది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ పేరాను తొలగించి.. అందరు విద్యార్థులకు పూర్తిగా మార్కులు ఇస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) లోక్ సభలో ప్రస్తావించారు. ఆమె దీనిపై మాట్లాడుతూ ఇది 'షాకింగ్ రిగ్రెసివ్ పాసేజ్' అని ప్రస్తావించింది. ఈ ప్యాసెజ్ను తొలగించడంతోపాటు బోర్డు క్షమాపణలు చెప్పాలని కోరింది.
#WATCH | Congress interim chief Sonia Gandhi raises in Lok Sabha the issue of inclusion of a 'shockingly regressive passage' in CBSE's question paper for Grade 10 exam, demands withdrawal of the passage & apology
(Source: Sansad TV) pic.twitter.com/lO1Db4ty3q
— ANI (@ANI) December 13, 2021
‘ఇప్పటి వరకు సీబీఎస్ఈ పేపర్లన్నీ కఠినంగానే ఉన్నా యి. ఇక ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చిన కాంప్రెహెన్షన్ పాసేజ్ చాలా అసహ్యంగా ఉంది. యువత మనోధైర్యా న్ని , భవిష్య త్తును దెబ్బ తీసే ఇటువం టి చర్య..
UGC NET 2021: యూజీసీ నెట్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష తేదీలు ఇవే
ఆర్ఎస్ఎస్-భాజపా ప్రయత్నా ల్లో భాగమే’ అని కాం గ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Most #CBSE papers so far were too difficult and the comprehension passage in the English paper was downright disgusting.
Typical RSS-BJP ploys to crush the morale and future of the youth.
Kids, do your best.
Hard work pays. Bigotry doesn’t.
— Rahul Gandhi (@RahulGandhi) December 13, 2021
ప్రియాంక గాంధీ కూడా ఈ అంశంపై మాట్లాడారు. మనం నిజంగా పిల్లలకు ఏం నేర్పుతున్నాము.. బీజేపీ ప్రభుత్వం మహిళలపై ఈ తిరోగమన దృక్పథాలను ప్రోత్సహిస్తోందని ఆమె వ్యాఖానించారు. ఇలాంటివి సీబీఎస్సీ పాఠ్యాంశాల్లో ఎందుకు కనిపిస్తున్నాయని అన్నారు.
Air Purifiers: మార్కెట్లో టాప్ కంపెనీ ప్యూరిఫైయర్లు.. ధర రూ.10,000 కంటే తక్కువే!
I have written to the Chairperson of CBSE @cbseindia29 urging him to recall the paper and debrief it with the students. Such regressive ideas must find no place in the 21st century. https://t.co/ozQOXGIKWy pic.twitter.com/KXZt8124Iq
— Jothimani (@jothims) December 12, 2021
ఈ అంశపై పలువురు ట్వీట్ కూడా చేశారు. ఇంగ్లీష్ పేపర్ చాలా అసహ్యం గా ఉం దని కాం గ్రెస్ నేత రాహుల్ గాం ధీ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది ఆర్ఎస్ఎస్-భాజపా పన్నా గం లోనే భాగమేనని ఆరోపిం చిన ఆయన.. యువత మనోధైర్యా న్ని, భవిష్య త్తును నాశనం చేసే ప్రయత్న మేనని దుయ్య బట్టారు. దీంతో బోర్డు పేరాను ఉపసహరించుకొని విద్యార్థులందరికీ మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
గతంలోనూ..
గతంలోనూ సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల్లో తప్పులు వచ్చాయి. "2002లో గుజరాత్లో ముస్లిం వ్యతిరేక హింస ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది?" అంటూ CBSE 12వ తరగతి పరీక్షలో అడిగింది. అప్పుడు దీనిపై విమర్శలు రావడంతో బోర్డు క్షమాపణలు చెబప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Education CBSE, Exams