హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్

బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్(ఫైల్ ఫోటో)

బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్(ఫైల్ ఫోటో)

17వ లోక్‌సభ తొలి సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభంకానుండగా...స్పీకర్ ఎన్నికను 19న చేపట్టనున్నారు. 20న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.

బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ 17వ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 17న ప్రారంభంకానున్నాయి. తొలి రెండు రోజుల్లో ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్ లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మునుపటి మోదీ సర్కారులో ఆయన కేంద్ర సహాయ మంత్రిగానూ వ్యవహరించారు.

లోక్‌సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభంకానుండగా...స్పీకర్ ఎన్నికను 19న చేపట్టనున్నారు. 20న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు.

First published:

Tags: Bjp, Union Budget 2019

ఉత్తమ కథలు