ఇప్పడు దేశమంతటా పశ్చిమ బెంగాల్ (West Bengal) ఉపఎన్నికల గురించే చర్చించుకుంటోంది. ఎందుకంటే బెంగాల్ సీఎం మమత బెనర్జీ (Mamata Banerjee) భవితవ్యం ఇవాళే తేలనుంది. భవానీపూర్ (Bhabanipur) ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. మొత్తం 21 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. మరి ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తుందా? లేదంటే ఏప్రిల్లో నందిగ్రామ్లో ఓడిపోయినట్లుగానే పరాజయం పాలవుతుందా? అనే దానిపై బెంగాల్ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితంపై ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఒకవేళ మమత బెనర్జీ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గెలిస్తేనే ఆమె బెంగాల్ సీఎంగా కొనసాగుతారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. నాటి ఘర్షణల్లో పలువురు మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనలు ఉపఎన్నికల ఫలితాల తర్వాత జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ నేపథ్యంలో భవానీపూర్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు.
బిహార్లో ఎల్జేపీకి ఎన్నికల కమిషన్ షాక్.. పార్టీ గుర్తు స్తంభింపజేస్తూ నిర్ణయం
ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఉపఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు మమత. సెప్టెంబరు 30న పశ్చిమ బెంగాల్లో భవానీపూర్తో పాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ (Jangipur), సంషేర్ గంజ్ (Samserganj) స్థానాలకు పోలింగ్ జరిగింది. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal), సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ (Srijib Bishwas) పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు.
భవానీపూర్లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో రెండు సార్లు (2011, 2016) గెలిచారు. మూడోసారి కూడా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సోవన్ దేబ్ ఛటర్జీ విజయం సాధించారు. కానీ నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతితో మమతా బెనర్జీ ఓడిపోవడంతో.. ఆమె ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుగా ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
వృద్ధులకు గుడ్ న్యూస్.. వారి కోసం ఆన్లైన్ జాబ్ ఎక్స్ఛేంజ్ పోర్టల్.. పోర్టల్ ప్రత్యేకతలు ఇవే
కాగా, ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 294 అసెంబ్లీ సీట్లుండగా.. తృణమూల కాంగ్రెస్ పార్టీ 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబరు 3న వెల్లడిస్తారు. భవానీపూర్లో మమతా బెనర్జీ గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగుతారు. ఓడిపోతే మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mamata Banerjee, TMC, Trinamool congress, West Bengal