హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Real Heroes: రైజింగ్ ఇండియా అవార్డుకు ఎంపికైన అస్సాం వ్యక్తి..అతడి ప్రస్థానం..

Rising India Real Heroes: రైజింగ్ ఇండియా అవార్డుకు ఎంపికైన అస్సాం వ్యక్తి..అతడి ప్రస్థానం..

Photo: News 18

Photo: News 18

న్యూఢిల్లీ, తాజ్‌ ప్యాలెస్‌లో రైజింగ్ ఇండియా సమ్మిట్-2023 ప్రారంభమైంది. రెండు రోజుల సదస్సును న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మిట్ థీమ్‌ని 'ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా'గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Rising India Real Heroes: న్యూఢిల్లీ, తాజ్‌ ప్యాలెస్‌లో రైజింగ్ ఇండియా సమ్మిట్-2023(Rising India Summit 2023) ప్రారంభమైంది. రెండు రోజుల సదస్సును న్యూస్18 నెట్‌వర్క్, పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మిట్ థీమ్‌ని 'ది హీరోస్ ఆఫ్ రైజింగ్ ఇండియా'గా ప్రకటించారు. సామాజిక, కమ్యూనిటీ నేతృత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందించిన వ్యక్తులను సత్కరించనున్నారు. అయితే విద్యా విభాగంలో అస్సాంకు చెందిన అహ్మద్ అలీ న్యూస్18 రైజింగ్ ఇండియా రియల్ హీరోస్ అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 30న అవార్డును అందుకోనున్నారు. అహ్మద్‌ అలీ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన అహ్మద్ అలీ చాలా మందికి ఆదర్శం. ముఖ్యంగా తమ కమ్యూనిటీలలో సానుకూల మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వారికి నిజమైన ప్రేరణ. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, 87 ఏళ్ల వయసులో అహ్మద్‌ అలీ పేద పిల్లలకు విద్యను అందించడానికి తన గ్రామంలో పాఠశాలలను స్థాపించారు. ఆటోరిక్షా నడుపుతూ సంపాదించిన డబ్బుతో మొత్తం తొమ్మిది పాఠశాలలను నిర్వహిస్తున్నారు. తన కమ్యూనిటీలో విద్య , పేదరికం మధ్య అంతరాన్ని తగ్గించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అవకాశాలు అందుకోవాలన్నా, బతుకులు మారాలన్నా విద్య కీలకమని అహ్మద్‌ అలీ నమ్మారు.

అహ్మద్ అలీ బంగ్లాదేశ్ సరిహద్దులో భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని పథర్‌కండి, ఖిలోర్‌బంద్‌ నివాసి. తన గ్రామమైన మధుర్‌బంద్‌లో 1978లో మొదటి పాఠశాలను ప్రారంభించారు. తన భూమిలో కొంత భాగాన్ని అమ్మి, దానిలో కొంత భాగాన్ని పాఠశాల నిర్మించేందుకు విరాళంగా ఇచ్చారు. పాఠశాలకు నిధులు దాని డిపాజిట్లు, రోజువారీ సంపాదన, విరాళాల నుంచి సేకరిస్తారు. ఆయన 1990లో ఉన్నత పాఠశాల స్థాపించారు. మరో మూడు లోయర్ మిడిల్ స్కూల్స్, ఐదు మాధ్యమిక పాఠశాలలు, ఒక ఉన్నత మాధ్యమిక పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కళాశాలను నెలకొల్పాలనే లక్ష్యంతో ఉన్నారు.

పాఠశాలల నిర్మాణానికి తన సొంత భూమిని విరాళంగా ఇవ్వడంతో పాటు, వాటి నిర్వహణకు అలీ కృషి చేస్తున్నారు. జీవనోపాధి కోసం పగటిపూట రిక్షా నడుపుతారు. పాఠశాల ఆర్థిక అవసరాలకు చేయూత ఇవ్వడానికి రాత్రిపూట కలప కోసం చెట్లు నరుకుతారు. ఆయన అంకితభావం, కృషి అతని కమ్యూనిటీలోని చాలా మంది పిల్లల చదువుపై గణనీయమైన ప్రభావం చూపాయి.

Indian Railways: 2014 కంటే మూడు రెట్లు వేగంతో పూర్తవుతున్న రైల్వే ప్రాజెక్టులు..ఎలా సాధ్యమైంది?

 అహ్మద్ అలీ పనికి గతంలో గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు అతడు విద్యా విభాగంలో న్యూస్18 రైజింగ్ ఇండియా రియల్ హీరోస్ అవార్డుకు ఎంపికయ్యాడు. మార్చి 30న న్యూ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో జరిగే న్యూస్18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో అతనికి అవార్డును అందజేయనున్నారు.

అతని కథను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' రేడియో ప్రోగ్రామ్‌లో పంచుకున్నారు. తద్వారా చాలా మంది వారి కమ్యూనిటీలలో ఇలాంటి పనులు చేపట్టేలా స్ఫూర్తిని పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “అసోంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన అహ్మద్ అలీ అనే రిక్షా నడిపే వ్యక్తి, పేద పిల్లల చదువుల కోసం తొమ్మిది పాఠశాలలను ప్రారంభించాడని నాకు తెలుసు. మన దేశ ప్రజల సంకల్పానికి ఇది నాంది’ అని చెప్పారు. జూక్టో అనే NGO కూడా అలీని ఒక సదస్సులో మాట్లాడాల్సిందిగా ఢిల్లీకి ఆహ్వానించింది.

First published:

Tags: Assam, Schools

ఉత్తమ కథలు