హోమ్ /వార్తలు /జాతీయం /

అరుణాచల్‌లో ఆ సర్టిఫికెట్ చిచ్చు : రగులుతోన్న అశాంతి.. డిప్యూటీ సీఎం బంగ్లాకు నిప్పు

అరుణాచల్‌లో ఆ సర్టిఫికెట్ చిచ్చు : రగులుతోన్న అశాంతి.. డిప్యూటీ సీఎం బంగ్లాకు నిప్పు

అరుణాచల్ ప్రదేశ్‌లో నిరసనల దృశ్యం (Image: ANI/Twitter)

అరుణాచల్ ప్రదేశ్‌లో నిరసనల దృశ్యం (Image: ANI/Twitter)

Arunachal Pradesh Protests : వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అరుణాచల్‌లో స్థిరపడ్డవారికి కూడా ప్రభుత్వం శాశ్వత నివాస సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అరుణాచల్ అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యగా వారు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...

    అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేస్తున్న శాశ్వత నివాస సర్టిఫికెట్ పెను వివాదానికి దారి తీసింది. అరుణాచల్ రాష్ట్రానికి చెందని కొన్ని షెడ్యూల్ తెగలకు కూడా ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేస్తోందని స్థానికులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో రాజధాని ఈటానగర్‌లోని రాష్ట్ర డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ఇంటిపై శనివారం దాడి చేసిన కొంతమంది నిరసనకారులు.. బంగ్లాకు నిప్పు పెట్టారు. దీంతో డిప్యూటీ సీఎం ఆదివారం ఉదయం ఈటానగర్ నుంచి నామ్‌సాయికి తన మకాం మార్చారు.


    డిప్యూటీ సీఎం ఇంటితో పాటు జిల్లా కమిషనర్ నివాసంపై కూడా నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి అరుణాచల్‌లో స్థిరపడ్డవారికి కూడా ప్రభుత్వం శాశ్వత నివాస సర్టిఫికెట్లు జారీ చేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అరుణాచల్ అస్థిత్వాన్ని దెబ్బతీసే చర్యగా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం సాయంత్రం నుంచి భారీ స్థాయిలో నిరసనలు చేపడుతున్నారు.


    నిరసనకారులను అదుపుచేసేందుకు శుక్రవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దాదాపు 50 కార్లతో పాటు ఇతర వాహనాలకు నిరసనకారులు నిప్పంటించారు. ఓ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు నాగాలాండ్ నుంచి వచ్చిన ఓ మ్యూజిక్ బ్యాండ్‌పై కూడా నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. అరుణాచల్‌లో పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పెద్ద ఎత్తున మిలటరీ బలగాలను రప్పిస్తున్నారు. చాలాచోట్ల కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం ఇప్పటికే ఆరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలను రంగంలోకి దింపింది.


    శాశ్వత నివాస సర్టిఫికెట్ల జారీ నిమిత్తం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. రాష్ట్రంలోని ఆరు కులాలకు శాశ్వత నివాస సర్టిఫికెట్ల జారీకి ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. అయితే ఇందులో నామ్‌సాయి, చంగ్‌లంగ్ జిల్లాలకు చెందిన షెడ్యూల్ తెగల వారు కూడా ఉండటంపై అరుణాచల్ ప్రదేశ్ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నా.. వారు అరుణాచల్ వాసులు కాదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలని చెబుతున్నారు.




    First published:

    Tags: Crime

    ఉత్తమ కథలు