భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (Chief of Defence Staff) బిపిన్ రావత్ (Bipin Rawat) ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air force) హెలీకాఫ్టర్ (Chopper) తమిళనాడులోని కూనూర్ (Kunoor) సమీపంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. జనరల్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ (Bipin Rawat) ఈయన మార్చ్ 16, 1958లో జన్మించారు. ఆయన ఉత్తరాఖండ్లోని పౌరిలో హిందూ గర్వాలీ రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు. ఈ కుటుంబం అనేక తరాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నది. అతని తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ పౌరీ గర్వాల్ జిల్లాలోని సైన్జ్ గ్రామానికి చెందినవారు మరియు లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. బిపిన్ రావత్ (Bipin Rawat) తల్లి ఉత్తరకాశీ జిల్లాకు చెందిన వారు. ఉత్తరకాశీ నుంచి శాసనసభ మాజీ సభ్యుడు (MLA) కిషన్ సింగ్ పర్మార్ కుమార్తె.
ప్రస్తుతం జనరల్ బిపిన్ రావత్ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవహరిస్తున్నారు. జనరల్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన్ను దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా కేంద్రం ప్రకటించింది. ఈ పదవి ఏర్పాటుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంగీకారంతో కేంద్రం ఈ నిర్ణయించింది.
విద్యాభ్యాసం..
బిపిన్ రావత్ డెహ్రాడూన్ (Dehradun)లోని కేంబ్రియన్ హాల్ స్కూల్లో, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్లో చేరాడు, అక్కడ అతనికి 'స్వర్డ్ ఆఫ్ హానర్' అవార్డు కూడా లభించింది.
- రావత్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (DSSC), వెల్లింగ్టన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ కాన్సాస్లోని ఫోర్ట్ లీవెన్వర్త్లోని జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత కమాండ్ కోర్సులో కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు.
- DSSCలో అతని పదవీకాలం నుంచి ఆయన డిఫెన్స్ స్టడీస్ (Defense Study)లో ఎంఫిల్ డిగ్రీతో పాటు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమాలు చేశారు. 2011లో, మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ అతని సైనిక-మీడియా వ్యూహాత్మక అధ్యయనాలపై చేసిన పరిశోధనలకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని ప్రదానం చేసింది.
సైన్యంలో బిపిన్ రావత్ ప్రస్థానం..
- ఆయన డిసెంబర్ 16, 1978లో 11 గూర్ఖా రైఫిల్స్ యొక్క 5వ బెటాలియన్లో చేరారు. అక్కడ ఆయన పది సంవత్సరాలు విధులు నిర్వహించారు.
- అనంతరం ఆయన జమ్మూ కాశ్మీర్లోని ఉరీలో ఓ కంపెనీకి మేజర్గా కమాండ్గా ఉన్నాడు.
- కల్నల్గా, ఆయన కిబితు వద్ద వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి తూర్పు సెక్టార్లో తన బెటాలియన్, 5వ బెటాలియన్ 11 గూర్ఖా రైఫిల్స్కు నాయకత్వం వహించాడు.
- అనంతరం బ్రిగేడియర్ స్థాయికి పదోన్నతి పొందారు. ఈ హోదాలో సోపోర్లోని రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 సెక్టార్కు కమాండ్గా పనిచేశాడు.
- డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (MONUSCO)లో చాప్టర్ VII మిషన్లో బహుళజాతి బ్రిగేడ్కు నాయకత్వం వహించాడు, అక్కడ అతనికి రెండుసార్లు ఫోర్స్ కమాండర్ ప్రశంసలు లభించాయి.
- బ్రిగేడ్ నుంచి ఆయన మేజర్ జనరల్గా పదోన్నతి పొందారు. ఈ హోదాలో బిపిన్ రావత్ 19వ పదాతిదళ విభాగం (ఉరి) కమాండింగ్ జనరల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు.
- లెఫ్టినెంట్ జనరల్గా, అతను పూణేలోని సదరన్ ఆర్మీకి బాధ్యతలు స్వీకరించే ముందు దిమాపూర్లో ప్రధాన కార్యాలయం కలిగిన III కార్ప్స్కు నాయకత్వం వహించాడు.
- బిపిన్ రావత్ ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్లో జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2, సెంట్రల్ ఇండియాలో రీ-ఆర్గనైజ్డ్ ఆర్మీ ప్లెయిన్స్ ఇన్ఫాంట్రీ డివిజన్ (RAPID) యొక్క లాజిస్టిక్స్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్గా విధులు నిర్వర్తించారు.
- అనంతరం మిలిటరీ సెక్రటరీ బ్రాంచ్లో మిలిటరీ సెక్రటరీ అండ్ డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ మరియు జూనియర్ కమాండ్ వింగ్లో సీనియర్ ఇన్స్ట్రక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
- బిపిన్ రావత్ తూర్పు కమాండ్ యొక్క మేజర్ జనరల్ జనరల్ స్టాఫ్ (MGGS) గా కూడా పనిచేశాడు. బిపిన్ రావత్ ఆర్మీ కమాండర్ గ్రేడ్కు పదోన్నతి పొందిన తరువాత, రావత్ 1 జనవరి 2016న జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) సదరన్ కమాండ్గా బాధ్యతలు చేపట్టారు.
- అనంతరం కొద్దికాలానికే సెప్టెంబర్ 1, 2016లో ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవిని చేపట్టాడు.
- డిసెంబర్ 17, 2016లో భారత ప్రభుత్వం ఆయన్ని ఆర్మీ స్టాఫ్ యొక్క 27వ చీఫ్గా నియమించింది. ఆ తరువాతం డిసెంబర్ 31, 2016న 27వ COASగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవిని చేపట్టారు.
- 2019లో బిపిన్ రావత్ యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో, జనరల్ రావత్ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ మరియు జనరల్ స్టాఫ్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో గుర్తింపు పొందారు.
- బిపిన్ రావత్ భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) 30 డిసెంబర్ 2019న బాధ్యతలు స్వికరించారు. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57కి చివరి ఛైర్మన్గా అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క 26వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశాడు.
ప్రమాదంలో మృతి..
తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్లో డిసెంబర్ 8, 2021న ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావత్తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైన్యం.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తమిళనాడులోని కూనూరు అటవీప్రాంతలో బిపిన్రావత్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురైంది.
వీరు ప్రయాణిస్తున్న ఎంఐ-17 చాపర్ అకస్మాత్తుగా చెట్లపై కూలిపోయింది. ఈ క్రమంలో హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదాన్ని, ఆయన మృతిని అధికారికంగా ధ్రువీకరించింది.
హెలికాప్టర్ సామర్థ్యం..
బిపిన్ రావత్ ప్రయాణం చేసింది ఆర్మీకి చెందిన Mi-17V5 హెలికాప్టర్.. ఇది రష్యాలో తయారైన Mi-8 హెలికాప్టర్ల మిలిటరీ ట్రాన్స్పోర్ట్ వెర్షన్. అవసరమైనప్పుడు దళాలను మోహరించడం, ఆయుధ రవాణా, అగ్నిమాపక సేవలు, పెట్రోలింగ్, సెర్చ్, రెస్క్యూ మిషన్లకు Mi-17V5 హెలికాప్టర్ను ఉపయోగిస్తారు. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లలో ఈ మోడల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన సైనిక రవాణా హెలికాప్టర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army Chief General Bipin Rawa, Helicopter Crash, Indian Air Force, Indian Army