వేడుకలు, దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఐతే టపాసుల వల్ల పర్యావరణం కాలుష్యం జరుగుతుండడంతో.. బాణాసంచాపై నిషేధం విధించాలంటూ ఎన్నో స్వచ్చంధ సంస్థలు కోర్టుల్లో కేసులువేశాయి. పూర్తిస్థాయిలో నిషేధించకున్నా గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కేసులపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాహనాల వల్లే ఎక్కువ కాలుష్యం జరుగుతోందని..కేవలం బాణాసంచా వెనకాలే ఎందుకు పడతారని పిటిషనర్లను ప్రశ్నించింది.
గత ఏడాది దీపావళి సందర్భంగా బాణసంచాపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు. తక్కువ కాలుష్యం వెదజల్లే గ్రీన్ క్రాకర్స్ (పర్యావరణహిత బాణసంచా)ని మాత్రమే వాడాలని..అది కూడా రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకే ఆదేశించింది. అటు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లోనూ అర్ధరాత్రి 11.55 - 12.30 మధ్యే బాణాసంచాను కాల్చాలని ఆంక్షలు విధించింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో క్రాకర్స్ అమ్మకాలను బ్యాన్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Supreme Court