Vijayalakshmi passes away: అన్నాడీఎంకే (AIADMK) నేత పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ... హార్ట్ ఎటాక్తో కన్నుమూశారు. విజయలక్ష్మీ (Vijayalakshmi) రెండు వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఐతే... ఆమెకు శరీరంలోని కొన్ని అవయవాలకు అనారోగ్య సమస్యలున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమె ఆరోగ్యం క్షీణించింది. సడెన్గా హార్ట్ ఎటాక్ (Heart Attack) రావడంతో... ఆమెను కాపాడటం డాక్టర్ల వల్ల కాలేదు.
విషాదంలో ఓపీఎస్: పన్నీర్ సెల్వం పార్టీ అన్నాడీఎంకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఈ పార్టీలో నిస్తేజం అలుముకుంది. మళ్లీ ఇప్పట్లో ఎన్నికలు జరగవనే ఉద్దేశంతో పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా యాక్టివ్గా లేవు. ఈ సమయంలో... తమిళనాడుకి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం (Panneerselvam).. ప్రస్తుతం అసెంబ్లీలో విపక్ష ఉపనేతగా కొనసాగుతున్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయి ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
AIADMK coordinator and former Chief Minister O. Panneerselvam’s wife Vijayalakshmi passes away. RIP pic.twitter.com/WbLsQpo5py
— Lokesh (@LokeshJey) September 1, 2021
AIADMK coordinator and former Tamil Nadu Deputy Chief Minister O Panneerselvam's wife Vijayalakshmi has passed away after suffering a heart attack.#OPanneerselvam #AIADMK #Vijayalakshmi #RIP @AIADMKOfficial #ADMK #Tamilnadu pic.twitter.com/J4XuCEjF4L
— Soundar C / சௌந்தர் செ (@soundarc2001) September 1, 2021
ఇది కూడా చదవండి: COVID: ఇండియాలో వారంలో 32 శాతం పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్
విజయలక్ష్మీ వయసు 63 ఏళ్లు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో... అన్నాడీఎంకే పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tamil nadu, Tamil nadu Politics